DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైకాపా ని నిర్వీర్వ్యం చేసేందుకే నగర కమిటీ కంకణం : పీతల యాదవ్  

విశాఖపట్నం, జులై 14, 2018 ( డిఎన్ఎస్): విశాఖ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే విశాఖ నగర కమిటీ కంకణం కట్టుకుందని విశాఖ ఫైర్ బ్రాండ్ గా

పేరుపొందిన యువకుడు, అధికార ప్రతినిధి పీతల మూర్తి యాదవ్  à°ªà°¾à°°à±à°Ÿà±€ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నగరం లోని à°“ హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన

మాట్లాడుతూ తానూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిని అని, అయన మరణానంతరం అయన కుమారుడు స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,

ప్రారంభం నుంచి నేటి వరకూ పార్టీ అభివృద్ధికే కృషి చేశానన్నారు. అయితే ధనమదంతో, అధికార పార్టీ నేతలు, మంత్రులు, ప్రజాప్రనిధులతో కుమ్మక్కు ఐన  à°¨à°—à°° కమిటీ

ప్రతినిధులు, తానూ అధికార తెలుగుదేశం నేతలు, మంత్రులు ముఖ్యంగా మంత్రి à°—à°‚à°Ÿ శ్రీనివాస రావు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ తదితరులు  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ అవినీతి,

భూదందాల పై ప్రశ్నించినందున షో కాజ్ నోటీసులు సైతం ఇచ్చారన్నారు. ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని ప్రశ్నించవలసిన వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు

ఉన్నారన్నారు. వేలకోట్ల భూములు అప్పనంగా లులు గ్రూప్ కి ఇవ్వడాన్ని ప్రశ్నిస్తే దాని పై నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని, అయితే అదే భూదందాలపై పార్టీ అధ్యక్షులు

జగన్ మోహన్ రెడ్డి, విశాఖ జీవీఎంసీ వద్ద భారీ ధర్నా చేశారన్నారు. మేము చేస్తే తప్పు పట్టారు, అధ్యక్షులు చేస్తే ఎందుకు నోరు మూసుకున్నారు అని ప్రశ్నించారు. 
నగరం

లో రౌడీ షీట్ ఉన్నవాళ్ళని, అరదండాలు పడిన వారికి పార్టీ పగ్గాలు అప్పగించడంతోనే పార్టీ పరువు బజారున పడిందన్నారు. ఆఖరికి జిల్లా జాయింట్ కలెక్టర్ అవినీతి కూడా

బయటపెడితే, దాన్ని కూడా మాఫీ చేసేసిన ఘనులు విశాఖ వైఎస్సార్ పార్టీలో ఉన్నారన్నారు. ప్రస్తుతం పార్టీ లోకి వచ్చిన వ్యక్తి పై మంత్రి కళా వెంకటరావు రౌడీ షీట్

తెరిపించిన మాట వాస్తవం కాదా అని అడిగారు, పైగా అతని పై భూ దందాలా కేసులు కూడా ఉన్నాయని,ఈ నేపథ్యంలోనే కారాగారానికి కూడా వెళ్లిన మాట వాస్తవం కాదా అని అడిగారు,

అలాంటి వ్యక్తికీ పార్లమెంట్ స్థాయి పదవి ఇవ్వడం ప్రజల్లోకి ఏవిధమైన సందేశాన్ని ఇస్తుందన్నారు. 
ఎండనక, వాననకా జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి పార్టీని

బలోపేతం చేస్తుంటే, విశాఖ నేతలు భూస్థాపితం చేస్తున్నారన్నారు. దీనిపై మనస్తాపం చెంది పార్టీ పదవులకి, ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు.

రాజీనామాను పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డికి, నగర అధ్యక్షుడు మళ్ల విజయ ప్రసాద్ కి , విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయ కర్త వంశీకృష్ణ కు పంపినట్టు

తెలిపారు. తదుపరి కార్యాచరణ త్వరలో తెలియచేస్తానన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam