DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అపచారం సరిచేసుకుంటే సర్వులకూ క్షేమకరం : ముత్తీవి సీతారాం పీఠాధిపతి 

విశాఖపట్నం, జులై 14, 2018 ( డిఎన్ఎస్): కోట్లాది మంది ఆరాధించే శ్రీరామునిపై కొందరు విద్రోహ శక్తులు చేసిన వాచాలతపై తగిన చర్యలు తీసుకోకుండా తప్పుపట్టిన స్వామి

పరిపూర్ణానందపై బహిష్కరణ వేటు వెయ్యడాన్ని పెదముత్తేవి శ్రీ కృష్ణ ఆశ్రమ నిర్వాహకులు ముత్తేవి సీతారాం తప్పుపట్టారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ

ప్రభుత్వం హిందూ ధర్మం పట్ల చేసిన తప్పును తక్షణం సరిదిద్దుకోవాలని హితవు పలికారు. తప్పులు చెయ్యడం మానవ నైజమని, తప్పును సరిదిద్దుకున్నవారే

మాననీయులవుతారన్నారు. భారత దేశ రాజ్యాంగం అందరికీ మత స్వేచ్ఛ ను, వాక్ స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందని, అంటే దాని అర్ధం ప్రక్కవారిని దూషించమని కాదన్నారు. ఇతరుల

మనోభావాలకు భంగం కల్గించకుండా సంయమనం తో ఈ హక్కుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హిందూ ధర్మానికి, తమ ఆరాధ్యమూర్తులకు అపచారం, అవమానం జరిగిన సందర్భంలో హిందూ

సమాజం మౌనంగా ఉంటుంది అని అనుకుంటే పొరపాటేనన్నారు. తమ ఆరాధ్యదైవం దూషణ ఎవరైనా చేస్తే భక్తులు సహించలేరని, వారి మనోభావాలను కాపాడవలసిన భాద్యత ఆయా ప్రభుత్వాలపై

ఉంటుందన్నారు. ధర్మ ప్రచారానికి అహరహం కృషి చేస్తున్న స్వామి పరిపూర్ణానంద పై విధించిన నిషేధాన్ని తక్షణం ఉపసరించుకోవాలని సూచించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam