DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బొమ్మన రాజ కుమార్ మృతి పట్ల ఆదిరెడ్డి కుటుంబం దిగ్బ్రాంతి 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 01, 2020 (డిఎన్ఎస్):*

 ప్రముఖ వస్త్ర వ్యాపార వేత్త ... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మన రాజ్ కుమార్ మృతి పట్ల ఎమ్మెల్యే, ఆదిరెడ్డి కుటుంబం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో

చికిత్స పొందుతున్న ఆయన మృతి పట్ల రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర రాఘవమ్మ, తెలుగుదేశం పార్టీ నేత అదిరెడ్డి శ్రీనివాస్, విచారం వ్యక్తం చేశారు. వస్త్ర ప్రపంచంలో రారాజుగా వెలుగొందిన ఆయన మరణ వార్త తమకు కలచి వేసిందని, బొమ్మన రాజ్

కుమార్ తో తమ కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఆయన మరణం తీరని లోటని విచారం వ్యక్తం చేశారు. బొమ్మన రాజ్ కుమార్  ఆయన తండ్రి పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదల మన్ననలు పొందారని కొనియాడారు. అలాగే ఛాంబర్ అధ్యక్షులుగా పని చేసి వ్యాపారుల సమస్యలను పరిష్కరించడంలో విశేష కృషి చేసి వ్యాపారుల మన్ననలు

పొందారని, ది జాంపేట కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ గా ఖాతాదారుల కోసం అనేక పథకాలు అమలు చేసి వారి సంక్షేమానికి కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన నిర్వహించిన వస్త్ర వ్యాపారంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ... విలువలతో కూడిన వ్యాపారం చేసి ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు

ప్రాంతాల్లో ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆదిరెడ్డి కుటుంబం దేవుణ్ణి వేడుకుంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam