DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఢిల్లీ కోర్టు లో పార్టీ భవితవ్యం పై వైకాపా నేతల్లో ఉత్కంఠ

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 02, 2020 (డిఎన్ఎస్):* యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ను ఇతరులు వాడకూడదు అనే ఫిర్యాదు పై ఢిల్లీ హై కోర్టు లో గుర్తింపు రద్దు కేసు గురువారం విచారణ కు రానుంది. ప్రస్తుత అధికార పార్టీని రద్దు చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పేరు వాడకుండా ఆదేశించాలని

ఇటీవల  ఢిల్లీ హై కోర్టు లో అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, జగన్ పార్టీకి నోటీసు జారీ చేసిన ఢిల్లీ హై కోర్టు... కౌంటర్ దాఖలు కు ఆదేశం జారీ చేసింది. ఇప్పటి వరకూ ఎటువంటి కౌంటర్ దాఖలు చేయక పోవడంతో గురువారం విచారణకు రానుంది. తమ నిజాయితీ నిరూపించు కోకుండా వాయిదా

కోరే ఆలోచన లో జగన్ పార్టీ, ఎన్నికల సంఘం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా, ఏపీరాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్ తదితర నాయకులు. 
తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, న్యాయ వ్యవస్థ పై ప్రఘాడ విశ్వాసం ఉందంటున్నారు అన్న వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా, రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ సత్తార్. తీర్పు అనంతరం గురువారం ఢిల్లీ హై కోర్టు వద్ద తమ న్యాయ వా దులతో  కలిసి మీడియా విలేకరుల తో మాట్లాడనున్నారు సత్తార్.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam