DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎం ఆర్ ఓ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు 

*7 జిల్లాల్లో దాడులు, భారీ మొత్తం ఆస్తులు, నగదు లభ్యం.* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 02, 2020 (డిఎన్ఎస్):* ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు వివిధ తహశిల్దర్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు కొనసాగిస్తున్నారు. బుధవారం జరిగిన ఈ తనిఖీల్లో రికార్డ్ లను ఏసీబీ

అధికారులు పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం, ఎమ్మిగనూరు ఎమ్మార్వో ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ కారులో రూ.2 లక్షలు లభ్యం అయ్యాయి. విశాఖ జిల్లా కసింకోట తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు, గుంటూరు జిల్లా రాజుపాలెం ఎమ్మార్వో కార్యాలయంలో ఏసీబీరైడ్స్ ,ప్రకాశం జిల్లా ఉలవపాడు ఎమ్మార్వో

కార్యాలయంలో సోదాలు జరుగగా, బలిజపేట ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ సోదాలు చేస్తున్నారు. 

రాజుపాలెం తాసిల్దార్ కార్యాలయంపై దాడులు. .. 

గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ

మధ్యాహ్నం సమయంలో తాసిల్దార్ కార్యాలయంలో కి అడుగుపెట్టగానే తాసిల్దార్ రూమ్ దగ్గరికి వెళ్లి తనిఖీ చేయగా తాసిల్దార్ చెంచులక్ష్మి తన చేతిలో ఉన్న నాలుగు వేల ఐదు వందలు రూపాయలు నగదు మరో అధికారి కి ఇచ్చే తరుణంలో జారి కింద పడిపోవడంతో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు పై తాసిల్దారు వివరణ కోరగా పొంతనలేని

సమాధానం చెప్పటం విశేషం. ఈ తరుణంలో అధికారులు కార్యాలయంలోని రికార్డులను పరిశీలించగా 102 పట్టాదారు పాసు పుస్తకాలు రైతులకు అందజేయ్యకుండా కార్యాలయంలో రహస్యం గా ఉంచడంపై పలు అనుమానాలకు దారి తీస్తూ ఈ నేపథ్యంలో అధికార్లు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇవి కాకుండా తాసిల్దారు మరియు వారి సిబ్బంది దగ్గర మొత్తం కూడా ఇరవై

రెండు వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ కుమార్ మీడియా కు సమాచారం తెలిపారు. ఈ దాడుల నేపథ్యంలో బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఈ తనిఖీల్లో భాగంగా అధికారులు వివరణ ఇవ్వడం జరిగింది తనిఖీలు రాత్రి కూడా నిర్వహించడం జరుగుతుందని పూర్తిస్థాయి నివేదిక రేపు ఇవ్వడం జరుగుతుందని అధికార్లు

తెలిపారు.ఈ కార్యక్రమంలో డి ఎస్ పి డి, హర్ష సీఐలు నాగరాజు రవిబాబు శ్రీధర్ ఎస్సై శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు

శ్రీకాకుళం జిల్లా గార ఎమ్మార్వో కార్యాలయంలోను, ఇబ్రహీంపట్నం మండల తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వివిధ స్థానాల్లో ఎన్నో కీలక పత్రాలు, నగదు స్వాధీనం

చేస్తున్నారు. 

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు... మొత్తం రెవెన్యూ అధికారులను, రెవెన్యూ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు...  మండల తహసిల్దార్ టీ. చంద్ర శేఖర్ నాయుడును అదుపులోకి విచారిస్తున్న ఏసీబీ అధికారులు ,

కీలక ఆధారాలు సేకరిస్తున్నారు.. రెవెన్యూ కార్యాలయం తో పాటు, అధికారుల వాహనాలను స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు...తాసిల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో  రూ..లక్షరూపాయలు డిప్యూటీ తాసిల్దార్ కారులో లక్ష రూపాయలు స్వాధీనపరుచుకున్న ఏసీబీ అధికారులు పూర్తి విచారణ అనంతరం వివరాలు మీడియాకు వివరిస్తామని ఏసీబీ

అధికారులు మహేశ్వర రాజు, హ్యాపీ కృపానందం, నజీరుద్దిన్ బృందం సోదాల్లో పాల్గొన్నారు..

కృష్ణాజిల్లా:- జగ్గయ్యపేట పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నందు ఏసీబీ దాడులు 40 వేల రూపాయలు పట్టుబడినట్లు ఆరోపణలు వివరాలు తెలియాల్సి ఉంది
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam