DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*తూగో జిల్లా లో రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోండి.* 

డిజిటల్‌ పేమెంట్‌ మిషన్‌ ప్రారంభంలో కలెక్టర్ మురళీధర్ రెడ్డి

*తూగో జిల్లా లో రైతు భరోసా కేంద్రాలను వినియోగించుకోండి.* 

 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 03, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లాలో రైతు సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో

ప్రతిష్టాత్మకంగా  ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌ రెడ్డి సూచించారు. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం తొర్రేడు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో రైతు సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ పేమెంట్‌ మిషన్‌ను గురువారం ఆయన

ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు సాగు చేసే వివిధ రకాల పంటల కోసం అవసరమైన విత్తనాలు, రసాయనిక ఎరువులను రైతులకు సకాలంలో అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలతోపాటు, రైతు పండించిన పంటను సైతం రైతు భరసా కేంద్రాల ద్వారా

పంట పొలంలోకే వచ్చి కొనుగోలు చేసే సౌలభ్యం కల్గుతుందన్నారు. రైతు భరోసా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్‌ పేమింట్‌ యంత్రం ద్వారా అవసరమైన ఎరువులను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవడంతోపాటు, ఆన్‌లైన్‌లోనే సంబంధిత ఎరువు వ్యాపారికి ఫోన్‌ పే ద్వారా డబ్బు చెల్లించుకునే వెసులుబాటు కల్గుతుందన్నారు. ఈ

సందర్భంగా గ్రామ రైతు నరుకుల అన్నవరంచే డిజిటల్‌ పేమెంట్‌ యంత్రంను ఉపయోగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ సమక్షంలో సంబంధిత రైతు ఐదు బస్తాల యూరియా, రెండు బస్తాల పటాష్‌ను ఆన్‌లైన్‌లో బుక్‌ చేశారు. 
అనంతరం తొర్రేడు గ్రామ శివారున ఈ`పంట నమోదులో గుర్తించిన పంట పొలాన్ని కలెక్టర్‌

పరిశీలించారు. ఈ సందర్భంగా సాగు చేసిన భూమిలో ఏఏ రకం వరి పంటను సాగు చేశారనే విషయాన్ని సంబంధిత రైతును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ`పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఈ పంట నమోదు ద్వారా ఎటువంటి విపత్కర

పరిస్థితుల్లోనైనా పంట నష్టం జరిగితే వెంటనే సంబంధిత సర్వే నెంబర్‌ భూమిలో వేసిన పంట వివరాలు, పంటకు అయిన పెట్టుబడి, సంబంధిత నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసేందుకు ఈ పంట నమోదు ఉపయోగ పడుతుందన్నారు. ఈ సందర్భంగా రైతుతో ఆయన మాట్లాడుతూ పంట దిగుబడి వచ్చిన వెంటనే రైతు భరోసా కేంద్రంను సంప్రదిస్తే సంబంధిత యంత్రాంగం నేరుగా

పంట పొలంలోకి వచ్చి పంటను కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. సంబంధిత దిగుబడికి సంబంధించిన మొత్తాన్ని వెంటనే సంబంధిత రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ`పంట నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. 

ఈ పర్యటనలో రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ

అంజలి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌, వ్యవసాయ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ కెఎస్‌వి ప్రసాదరావు, వ్యవసాయ శాఖ ఎడి బికె మల్లిఖార్జునరావు, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం రూరల్‌ మండల ఇన్‌ఛార్జ్‌ తహసీల్దార్‌ రామారావు, ఇన్‌ఛార్జ్‌ ఎంపీడీఒ సుబ్బారావు, తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam