DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏలూరు రేంజ్ లో కేసుల పురోగతిపై డిఐజి మోహన్ రావు సమీక్ష

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 03, 2020 (డిఎన్ఎస్):*  ఏలూరు రేంజ్ లోని పశ్చిమ గోదావరి మరియు కృష్ణా  జిల్లాలో ఇప్పటివరకు నమోదు అయిన మరియు విచారణలో ఉన్న కేసులను గురించి, వివిధ విభాగాలు, సెక్షన్లు క్రింద నమోదైన దోపిడీలు, అత్యాచారాల నిరోధక చట్టం కేసులపై  డిఐ జి కెవి మోహన్ రావు

సమీక్ష నిర్వహించారు. డిఐజి కె వి  మోహన్ రావు వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిపిన సమీక్షలో పశ్చిమ గోదావరి డియస్పి ఏ. శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడెం డి.యస్.పి ఎం. స్నేహిత, నరసాపురం డిఎస్పి కె.నాగేశ్వరరావు   మరియు నందిగామ డీఎస్పీ  జి.రమణ మూర్తి లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి మరియు కృష్ణా  జిల్లాలో   ఇప్పటివరకు

నమోదు అయిన మరియు విచారణలో ఉన్న కేసులను గురించి, సదరు కేసులలో దర్యాప్తు గురించి, ముద్దాయిలు యొక్క అరెస్ట్ ను గురించి, ఈ కేసులో దర్యాప్తు  అనంతరం చార్జిషీట్ లను కోర్టు లో ఫైల్ చేసే విషయాలపైన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 
ఇంక  దర్యాప్తు లో ఉన్న కేసులలో త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేయుట కొరకు తగిన సూచనలు,

సలహాలు, ఆదేశాలు అధికారులకు  ఇచ్చారు. ఎస్సీ & ఎస్ టి కేసులలో కోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసులలో ముద్దాయిలు యొక్క హాజరు సక్రమంగా జరుగుతుంది లేనిది అనే విషయం పైన అధికారుల వద్ద నుండి వివరములు డి. ఐ.జి అడిగి తెలుసుకున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam