DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్రంలో రైతులను మరింత అప్పుల పాలు చేస్తున్నారు.

*ఉచిత విద్యుత్ ను నీరుకారుస్తున్నారు : మాజీ ఎపి తోట* 

*ప్రభుత్వ నిర్ణయాలపై తోట సీతారామలక్ష్మి మండిపాటు*  

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 03, 2020 (డిఎన్ఎస్):* జగన్ మరిన్ని అప్పుచేయడానికి రైతులను అప్పులపాలు చేయబోతున్నారని మాజీ ఎపి, తెలుగుదేశం పశ్చిమగోదావరి

జిల్లా అధ్యక్షురాలు  తోట సీతారామలక్ష్మి మండిపడ్డారు. గురువారం జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలపై మండిపడ్డారు. 

ఉచిత విద్యుత్ పధకాన్ని నీరు కార్చబోతున్నారని, మరిన్ని అప్పులు తేవడం కోసం రైతులను అప్పుల పాలు చేస్తున్నారన్నారు. సున్నా వడ్డీ మాదిరే ఉచిత విద్యుత్ ను కూడా నీరు

కరుస్తున్నారన్నారు.  తెలంగాణ ప్రభుత్వం పంప్ సీట్లకు మీటర్లను వ్యతిరేకించినప్పుడు వైఎస్ జగన్ ఎందుకు వ్యతిరేకించలేదన్నారు. ఇప్పడికే ఈ ప్రభుత్వం లక్షా 8 వేల రూపాయల అప్పు చేయసిందన్నారు. మరింత అప్పుకు రైతులకు ఉచిత విద్యుత్ ను ప్రక్కదారి పట్టిస్తున్నారన్నారు.  
నవ రత్నాలను రోజుకో షరతు పెట్టి ప్రయోజనాలను

కుదిస్తున్నారన్నారు. నేడు వ్యవసాయానికి విద్యుత్ బిల్లుల్లో కూడా ఇదే పరిస్థితి రాదనే గ్యారంటీ లేదన్నారు. ఇప్పడికే రూ. 800 కోట్ల సున్నా వడ్డీ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందన్నారు. 1983 ముందు పంపు సేట్లకు మీటర్లు ఉండేవని, ఏన్ టి రామారావు ముఖ్యమంత్రి హయాంలో మీటర్ల విధానాన్ని తొలగించి స్లాబ్ విధానాన్ని ప్రవేశ

పెట్టారన్నారు. నాడు రైతులు లాభపడ్డారన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యత్తిరేకించారని  తెలిపారు. రైతులను దొంగల్లా భావించి మీటర్లు పెట్టారా అని వైఎస్సార్ ప్రశ్నించారన్నారు. నేడు అదే వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్ నేడు అవే మీటర్లు తిరిగి ప్రవేశ పెడుతున్నారన్నారు. రైతులతో పాటు విద్యుత్

వినియోగదారులందరూ అప్రమత్తం కావాలన్నారు. విద్యుత్ విధానాలను నిరసించి, విద్యుత్ విధానాలను నిరసించి తమను తాము కాపాడుకోవాలన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam