DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15 లోగా కేంద్ర బాలల అవార్డులకు దరఖాస్తు చెయ్యాలి

*ఐసిడిఎస్ పథక సంచాలకులు డా. జి.జయదేవి*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  సెప్టెంబర్ 03, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లాలోని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలబాలికలు, సంస్థలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల కొరకు ఈ నెల 15లోగా ఆన్ లైన్ లో నామినేషన్

చేసుకోవాలని జిల్లా మహిళా, శిశు అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు  డా. జి.జయదేవి పేర్కొన్నారు.  

గురువారం విడుదల చేసిన ప్రకటనలో వివరాలు తెలియచేసారు. సాంస్కృతిక, కళలు, క్రీడలు, సమాజసేవ, పాండిత్యం, సాహస రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన బాలలు, బాలల రక్షణ, అభివృద్ధి సంక్షేమం కొరకు పనిచేసిన వ్యక్తులు, సంస్థలకు

భారత ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేయడం జరుగుతుందని ఆమె చెప్పారు. ఇందులో బాలశక్తి, బాలకళ్యాణ్, సంస్థల పురస్కారాల కేటగిరీలు ఉంటాయని ఆమె ఆ ప్రకటనలో వివరించారు. పురస్కార గ్రహీతలకు 2021 గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి చేతుల మీదుగా పతకంతో పాటు ఐదు

లేదా లక్ష రూపాయల నగదు, ధృవపత్రాలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి వారిచే సన్మాన కార్యక్రమం ఉంటుందని ఆమె స్పష్టం చేసారు.  అర్హులైన బాలలు, వ్యక్తులు, సంస్థలు ఈ నెల 15లోగా www.nca.wcd.nic.in ఆన్ లైన్ లో నామినేషన్లను సమర్పించాలని ఆమె కోరారు. 
ఇతర సమాచారం కొరకు పథక సంచాలకులు,  జిల్లా మహిళా, శిశుఅభివృద్ధి

సంస్థ కార్యాలయాన్ని గాని లేదా 08942-240630 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని  ఆమె ఆ ప్రకటనలో వివరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam