DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*సొంత వాహనం లేకుంటే. . ఏపీ సరిహద్దు దాటే అవకాశం లేదు.* 

*అన్ లాక్ చేసినా ఏపీ - తెలంగాణ మధ్య బస్సు బంధం లేదు*

*రైళ్లు ఎలాగూ లేవు, బస్సులు కూడా లేకుంటే. . అంతేగతి. .*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 04, 2020 (డిఎన్ఎస్):* దేశవ్యాప్తంగా అన్ లాక్ చేసినా సొంత వాహనం లేకుంటే ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు దాటి ప్రక్క రాష్ట్రానికి

ప్రజలు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. దేశవ్యాప్తంగా అన్ లాక్ చేసినా ఏపీ - తెలంగాణ మధ్య ప్రగతి రథచక్రాలు ( ఆర్టీసీ బస్సు ) సర్వీసులు ప్రారంభం కాకపోవడంపై ఇరు ప్రాంతాల ప్రజలూ నానా అవస్థలు పడుతున్నారు. దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అవసరమైతే న్యాయ సలహా తీసుకుని ముందుకు

వెళ్లాలని జగన్ సూచించారు. అన్ లాక్ 4  ప్రారంభమైనా ఏపీ-తెలంగాణ మధ్య బస్సులు ప్రారంభం కాలేదని, ఇప్పడికే సాధారణ రైళ్లు ఎలాగూ నడవడం లేదని, బస్సులు కూడా నడవక పొతే ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులు దాటి వెళ్లాలంటే సొంతవాహనాలు తప్పని సరి అయ్యిందనే చర్చకు వచ్చింది.  
తెలంగాణకు బస్సులు నడిపే అంశం ఏం చేయాలని మంత్రులు పేర్ని

నాని, బొత్స సత్యనారాయణ సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి సూచనలు చేసినట్లు  సమాచారం. హైదరాబాద్ తోపాటు.. తెలంగాణలోని ఇతర ముఖ్య ప్రాంతాలన్నింటికీ బస్సులు నడవకపోవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. అసలే రైళ్లు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో కనీసం బస్సులైనా

లేకపోవడం పేదలను.. సామాన్యులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపినా.. కొలిక్కి రావడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉందని మంత్రులు వివరించినట్లు తెలుస్తోంది. దీనిపై వెంటనే స్పందించి సీఎం జగన్ హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రాంతాలకు వెంటనే ఆర్టీసీ బస్సులు నడిపేందుకు చర్యలు

తీసుకోవాలని.. ఈ విషయంలో అవసరమైతే న్యాయసలహా తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam