DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ పోర్టుకు ప్రతిష్టాత్మకమైన గ్రీనరీ అవార్డులు

విశాఖపట్నం, జులై 14 , 2018 (DNS Online ) : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిధిలోని పచ్చదనం సుందరీకరణ ( గ్రీనింగ్ ఆండ్ బ్యూటిఫికేషన్) కార్పొరేషన్ 2017 సంవత్సరానికి గాను ప్రకటించిన

గ్రీనరీ ఆవార్డును విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు అందుకున్నారు. విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ పరిశ్రమల విభాగంలో రాష్ట్రంలోనే మొదటి

స్ధానాన్ని కైవసం చేసుకుంది. ఇందులో భాగంగా వనం మనం కార్యక్రమ ప్రారంభోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లాలోని నూజివీడు ఐఐఐటి లో రాష్ట్ర ప్రభఫుత్వం నిర్వహించిన

ప్రత్యేక కార్యక్రమంలో ఆవార్డుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పరిశ్రమల విభాగంలో మొదటి బహుమతిని విశాఖపట్నం పోర్టు ట్రస్టు చైర్మన్  à°Žà°‚à°Ÿà°¿

కృష్ణబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు. వ్యక్తి గత విభాగంలో మొదటి రెండు స్ధానాలను విశాఖపట్నం పోర్టు ట్రస్టు కైవసం

చేసుకుంది. చైర్మన్ బంగ్లా గార్డెనింగ్ కు గానూ మొదటి స్ధానం డిప్యూటీ చైర్మన్ బంగ్లా గార్డెనింగ్ కు గానూ రెండో స్ధానం దక్కించుకుంది. 
మొదటి బహుమతిని

చైర్మన్ కృష్ణబాబు సతీమణి పద్మవల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా స్వీకరించారు. à°ˆ కార్యక్రమంలో పోర్టు తరపున చైర్మన్ కృష్ణబాబు, డిప్యూటీ చైర్మన్  à°ªà°¿à°Žà°²à±

హరనాధ్, చైర్మన్ సతీమణి పద్మవల్లి, డిప్యూటీ చైర్మన్ సతీమణి పోర్టు పర్యావరణ విభాగం అధికారులు శ్రీ శ్రీనివాస్ , శ్రీధర్ లు పాల్గొన్నారు.

సాంప్రదాయ ఇంధన

వనరుల వినియోగానికి విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ ప్రధాన్యత నిస్తోంది. ఇందులో భాగంగా 10 వేల మేగావాట్ల సోలార్ విద్యుత్ పవర్ ప్లాంట్ ను నెలకొల్పింది. దీనిద్వారా

ఉత్పత్తి అవుతున్న 15 లక్షల యూనిట్ల విద్యుత్ లో 9 లక్షల యూనిట్లను పోర్టు తన సొంత అవసరాల కోసం వినియోగిస్తోంది. మిగిలినది పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేసింది. దీంతో

పాటు 10 ఎంఎల్ డి మురుగునీటి శుద్ది కేంద్రం ద్వారా నీటిని శుద్ది చేసే వ్యవస్ధను నిర్వహిస్తోంది. దీని ద్వారా శుద్ది చేసిన నీటిని పోర్టులో దుమ్ము లేవకుండా

చిలకరించేందుకు వినియోగిస్తోంది.
గ్రీన్ విశాఖ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పోర్టు ట్రస్టు 1.75 లక్షల మొక్కలను గడచిన మూడేళ్లలో నాటింది. దీంతో

పాటు పోర్టు అంతర్గత రోడ్ల మధ్య డివైడర్లపై సుమారు 8 కిలోమీటర్ల మేర పచ్చదనాన్ని అభివృద్ది చేసింది. ఇందులో కాన్వెంట్ కూడలి, షీలానగర్ కూడలి , వై జంక్షన్, , పిసిఆర్

జంక్షన్, బీ రాంప్, ప్రాంతాల్లో లాండ్ స్కేపింగ్ విధానంలో పచ్చదనాన్ని అభివృద్ది చేసింది.

విమానాశ్రయానికి వెనకవైపున పిసిఆర్ జంక్షన్ నుంచి ఆర్ సిఎల్

జంక్షన్ వరకూ రోడ్డు వెడల్పు లో భాగంగా తొలగించిన 360 మొక్కల సంరక్షణ బాధ్యతను పోర్టు చేపట్టింది.
2018-19, 2019-20 సంవత్సరాలకు గాను అటవీ శాఖతో కలిసి తీర ప్రాంతాన్ని

రక్షించేందుకు సుమారు 2.30 కోట్ల రూపాయలతో 2 లక్షల నీడనిచ్చే చెట్లను పెంచేందుకు పోర్టు ప్రణాలికలు రూపొందించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam