DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈజ్ అఫ్ డూయింగ్ లో ఏపీ కి ప్రధమ స్థానం అవార్డు అందజేత

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 07, 2020 (డిఎన్ఎస్):* ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ కు దేశ వ్యాప్తంగా ఉన్నత స్థానం లభించడంతో కేంద్ర ప్రభుత్వం అవార్డును అందించింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ ఐఏఎస్ అధికారి, రెవెన్యూ, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు

ప్రత్యేక ప్రధాన  కార్యదర్శి  రజత్ భార్గవ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన మౌలిక వసతులు, ఆవశ్యకత, సంస్కరణలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన ధన్యవాదములు తెలిపారు. సోమవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ని కలిసి సభా వివరాలను

తెలియచేసారు. నూతన ప్రభుత్వం  ఏర్పాటైన తర్వాత ఏడాది జూన్ నుంచి ఆగస్టు కాలంలో (2019 ) కాలంలో మొత్తం 12 విభాగాల్లో 187 సంస్కరణలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని దేశవ్యాప్త సర్వే నిర్వహించి ఏపీ కి ఈ పురస్కారాన్ని అందించినట్టు వివరించారు. ఈ సర్వే ఫిబ్రవరి - మార్చి 2020 లో జరిగినట్టు తెలియచేసారు. జలమార్గంలో రవాణా, వాణిజ్య

వ్యవహారాల్లో సైతం దిశానిర్దేశం చేసిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను అభినందించారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ సర్వే నిర్వహించిన సమయంలో రజత్ భార్గవ పరిశ్రమల శాఖా ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి హోదాలో విధులు నిర్వహించారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam