DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిద్ర నటిస్తున్న దేవాదాయ మంత్రి రాజీనామా చెయ్యాల్సిందే

*అంతర్వేది రధాన్ని మాజీ ఈవో జీతంతోనే నిర్మించాలి*

*ఏపిలో హిందువుల పై రాక్షస పాలన అమలు చేస్తున్నారా?.*

*ఏపీ సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద డిమాండ్*

*విశాఖపట్నం సెప్టెంబర్ 10 2020 (డి ఎన్ ఎస్):* ఆంధ్రప్రదేశ్ లో లో రాక్షస పాలన సాగుతోందని హిందూ దేవాలయాల పై భౌతిక దాడులు జరుగుతూ

కూల్చివేస్తున్న కాల్చి వేస్తున్నా నా కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వ నేతలు తక్షణం పదవి దిగాలని ఆంధ్ర ప్రదేశ్ సాధుపరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి డిమాండ్ చేశారు. గురువారం విశాఖ నగరంలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గత 15 నెలల కాలంలో హిందువుల పాలిట రావణ

కష్టాన్ని చవి చూపించారని మండిపడ్డారు.

తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ రధాన్ని అన్యమత ముష్కరులు ఈనెల 5వ తేదీన అత్యంత దారుణంగా తగలబెడితే రక్షించవలసిన ఆలయ ఈవో కళ్ళు మూసుకుపోయి ఉన్నారన్నారు. కొన్ని నెలలుగా సీసీ కెమెరాలు పని చెయ్యకపోతే ఈఓ ఏమి చేస్తున్నట్టు అని

ప్రశ్నించారు. దీనికి కంప్యూటర్ ఆపరేటర్ ను భాద్యుణ్ని చేస్తూ సస్పెండ్ చేశారన్నారు. 

ప్రభుత్వ ఖర్చుతో 90 లక్షలు వెచ్చించి తిరిగి ఈ రధాన్ని ప్రభుత్వమే నిర్మిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజానికి ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు.  బాధించ బడినవాడు హిందువు

దానికి పరిష్కారం పరిహారం కూడా అదే బాధితులనుంచి చెల్లించాలి అనడం వీళ్ళ నిర్లక్ష్య వైఖరిని తెలియచేస్తోందన్నారు. 

దేవాదాయ శాఖ అంటే కేవలం హిందువులు హిందూ భక్తులు వివిధ గుళ్లో వేసే ముడుపుల తోనే నిర్వహించబడుతోందన్నారు. అలాంటిది ఒక హిందూ దేవాలయంపై దాడి జరిగితే దానికి నష్టపరిహారం హిందువులు ఎందుకు కట్టాలని

ప్రశ్నించారు. ఈ ఆలయాన్ని రక్షించవలసిన బాధ్యత కలిగిన ఈవో ఏ ఈ పరిహారాన్ని పూర్తిగా చెల్లించాలన్నారు. 
ఇలా ఒక్కసారి ఒక ఆలయంలో శిక్ష విధిస్తే ఈ రాష్ట్రంలోని మరో హిందూ దేవాలయంలో ఇటువంటి దాడులు జరగకుండా ఆలయాన్ని ఈవో లే కాపాడుతారు ఇంతకీ గత ఆరు నెలలుగా సీసీ కెమెరాలు పని చెయ్యకపోతే ఈవో ఏమి చేస్తున్నట్టు అని

ప్రశ్నించారు 

గత 15 నెలల కాలంలో రాష్ట్రం లో రాష్ట్రంలోని 18 ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసారని, రథాలు కాల్చారని, మూల విరాట్ లను పగల గొట్టారని, ఏకంగా హిందూ దేవాలయాల ఆస్తులను దోచుకు తిన్నారని మండిపడ్డారు. ఏ ఘటనలోనూ దేవాదాయ 
శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యక్షంగా వచ్చిన దాఖలాలు లేవన్నారు. గత 15

నెలల కాలం గా ఆయన గాఢనిద్ర పోతున్నారన్నారు. అంతర్వేది లో ఓపిక నశించిన హిందూ భక్తులు శాంతియుతంగా నిరసనలు తెలియచేస్తే వాళ్లందరినీ అరెస్ట్ చేయించడానికి మంత్రి తన వెంట మరో ఇద్దరినీ రక్షణగా తీసుకుని వచ్చి, చుట్టపు చూపుగా వచ్చారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam