DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది ఘటనపై భీమిలి బీజేపి నేతల శాంతి ధర్నా

*హిందూ వ్యవస్థను కూలగొట్టేందుకు అవిశ్రాంత కృషి* 

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 10, 2020 (డి ఎన్ ఎస్):* రాష్ట్ర వ్యాప్తంగా హిందూ దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు భీమిలి నియోజకవర్గం లో భారతీయ జనతా యువమోర్చ జోనల్ ఇంచార్జ్

పేరి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యవంలో శాంతియుత ధర్నా చేయ్యపట్టారు. గురువారం జనసేన పార్టీ శ్రేణులతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన ధర్నాల్లో జిల్లా వ్యాప్తంగా బీజేపీ నేతలు శాంతియుత నిరసనలు తెలిపారు. నల్ల రిబ్బన్లు ధరించి వారి వారి విధులకు హాజరయ్యారు. 
ఈ సందర్బంగా శ్రవణ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం హిందూ ధర్మ

పరిరక్షణ చేయకపోవడం వల్ల హిందూ దేవాలయ వ్యవస్థ చిన్నాభిన్నమవుతోందన్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలను దోచుకుతినేందుకే దేవాదాయ శాఖా ఉండనే భావనలో పాలకులు ఉన్నారన్నారు.  

గత 15 నెలల ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క జిల్లాలోనూ ఏ హిందూ దేవాలయం ప్రశాంతంగా లేదన్నారు. నేరుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా

ఒక అన్యమత వ్యక్తిని నియమించడంతో మొదలైన హిందూ వ్యతిరేక ఉద్యమం నిన్నటి రోజున తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మి నృసింహ స్వామి ఆలయ రధం కాల్చివేయడం వరకూ నిర్విఘ్నంగా హిందూ దేవాలయ వ్యవస్థను కూలగొట్టేందుకు ఈ ప్రభుత్వం అవిశ్రాంత కృషి చేస్తోందన్నారు. భాద్యత వహించాల్సిన దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

నిర్లక్ష్య వైఖరి తో పాటు అతనికి క్రైస్తవ, ముస్లిం ప్రతినిధులే ముఖ్యంగా తన నియోజకవర్గంలో వాళ్ళ స్థానాల్లో శంకుస్థాపనలు చేసుకుంటున్నాడన్నారు. 

కోవిడ్ నియమాలకు లోబడి, కనీస దూరం పాటిస్తూ, శాంతియుత నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమం లో భీమిలి నియోజకవర్గం నేతలు పురుషోత్తం రావు, చొప్ప వెంకట రావు, తాళ్లూరి శరత్

చంద్ర సాయి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam