DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం

*స్వాగతించిన ధార్మిక సంఘాలు, పీఠాధిపతులు*

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 10, 2020 (DNS):* తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని రథం దగ్దమైన అంశం పై సీబీఐ విచారణ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది, రధం ఎలా అగ్నికి

ఆహుతైందన్న అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు.  రాష్ట్ర డీజీపీ కార్యాలయం సీబీఐ దర్యాప్తును కోరుతూ హోం శాఖకు లేఖ వ్రాసారు. 

కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు సీబీఐ విచారణను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. పూర్తి పారదర్శకమైన ప్రభుత్వంగా ఈ కేసు విచారణను సీబీఐకి

అప్పగించాలని ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ని ఆదేశించారు

కేసు దర్యాప్తును ఏపీ పోలీసు సవాలుగా తీసుకున్న తర్వాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, బృందాలు ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని అపోహలను ప్రచారం చేస్తూ, ప్రెస్ మీట్లలోనూ, సోషల్ మీడియా పరంగా అసత్యాలు ప్రచారం

చేశారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటన చేసింది. ఈ అంశం పై శుక్రవారం జీవో వెలువడనుంది.

స్వాగతించిన ధార్మిక సంఘాలు, పీఠాధిపతులు:. . .

అంతర్వేది ఘటనపై ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని హిందూ ధార్మిక

సంఘాలు, విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాగతించారు. దేశంలోనే అత్యున్నత స్థాయి విచారణ ద్వారా అసలు కుట్ర కోణం బయటపడే అవకాశం ఉందన్నారు. సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయాన్ని సి.బి.ఐ  నిగ్గు తేలుస్తుంది

టీటీడీని కాగ్ పరిధిలోకి తీసుకురావాలన్న నిర్ణయం, అంతర్వేది ఘటనపై సిబిఐ

విచారణకు ఆదేశించడం హిందువులంతా హర్షించదగ్గ విషయం అన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam