DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చలో అంతర్వేదికి అనుమతి లేదు, సహకరించండి : డిఐజి

*ధార్మిక పక్షాలకు ఏలూరు డిఐజి మోహన్ రావు సూచన*   

*బీజేపీ, జనసేన చలో అంతర్వేది జరిగేనా, తగ్గేనా?* 

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 10, 2020 (DNS):* తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లో జరిగిన రథం అగ్ని ప్రమాద సంఘటన స్థలం పరిసర ప్రాంతాలలో  30 పోలీస్ యాక్ట్ మరియు 144 సెక్షన్ నిషేధాజ్ఞలు

అమలులో ఉన్నట్లు ఏలూరు రేంజ్ డిఐజి కెవి మోహన్ రావు తెలిపారు. అత్యంత పవిత్రమైన లక్ష్మి నృసింహ స్వామి క్షేత్రంలో ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అంతర్వేది గ్రామము పరిసరాలకు ఇతర ప్రాంతాలకు  చెందిన ఎవరు రాకూడదని, అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. చలో

అంతర్వేది అనే కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని తెలియచేసారు. అత్యంత సునిశితమైన ఘటన కావడంతో హిందూ ధార్మిక ప్రతినిధులు సంయమనం పాటించాలని కోరారు. ఘటన పై ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ చేసి, దోషులను శిక్షించే విధంగా చర్యలు చేపడుతుందన్నారు. ధార్మిక క్షేత్రంలో ఎటువంటి అలజడులకు అవకాశం ఇవ్వవద్దని, డిఐజి

తెలియజేసినారు.

ఈ క్రమం లో శుక్రవారం 11 వ తేదీన భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లు ఇచ్చిన చలో అంతర్వేది కార్యక్రమం నిర్వహిస్తారా, లేదా డిఐజి సూచన మేరకు సహకరిస్తారా వేచి చూడాలి. అయితే ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించడం గమనార్హం.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam