DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ పై  రాంబాబు ..కార్టూన్లు  పుస్తకం ఆవిష్కరణ

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 11, 2020 (డి ఎన్ ఎస్):* ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో  సామాజిక చైతన్యం కలిగించేందుకు ఎవరి స్థాయిలో వారు పూర్తి స్థాయిలో కృషి చేయాలని  జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్టుల  ఫోరం అధ్యక్షుడు గంట్ల

శ్రీనుబాబు  పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం డాబా గార్డెన్స్ విజేఫ్ ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్టు కోరాడ రాంబాబు రచించి రూపకల్పన చేసిన 'రాంబాబు కార్టూన్లు' పుస్తకాన్ని గంట్ల శ్రీనుబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్టూన్ల రచయిత రాంబాబు ప్రతిభ అత్యంత

ప్రశంసనీయమని కొనియాడారు,, ప్రతి కార్టూన్.ను ఎంతో  సామాజిక చైతన్యం, అవగాహన కల్పించే దిశగా..రూపొందించారన్నారు.  రచయిత సామాజిక సేవా కార్యక్రమంలు  నిర్వహించడం తో పాటు తన కార్టూన్స్  ద్వారా సమాజానికి మంచి సందేశాలను పంపించాలని  భావించడం, ప్రశంసనీయం అన్నారు .భవిష్యత్తు లో మరిన్ని సేవా కార్యక్రమం లు అందించాలని, తన

కార్టూన్స్ తో సమాజం కు మంచి జరిగేలా చూడాలని కోరారు. 
రచయిత కోరాడ రాంబాబు మాట్లాడుతూ కార్టూన్స్ కేవలం నవ్వించడం కోసమే కాకుండా సామాజిక చైతన్యం కలిగించే విధంగా ఉండాలి అన్నది తన అభిమతం అన్నారు. ఈ పుస్తకం పలువురు ని ఆలోచన చేసే విధంగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమం లో రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam