DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 11, 2020 (DNS):* ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టోకరా వేస్తున్నారని మాజీ మంత్రివర్యులు పీతల సుజాత అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం హయాంలో తెలుగుదేశం 93లక్షల మందికి ఇస్తే ప్రస్తుతం జగన్ రెడ్డి 87 లక్షల మందికే కుదింపు చేస్తున్నారన్నారు. టీడీపీ

ప్రభుత్వం డ్వాక్రా రుణమాపీ, పసుపు కుంకుమ మహిళలకు రూ.21వేల కోట్లు ఇచ్చిందన్నారు. 

జగన్మోహన్ రెడ్డి ఆసరా పథకం పేరుతో కోటి మంది డ్వాక్రా మహిళలకు టోకరా వేశారు. కొత్త సీసాలో పాత సారా పోస్తూ.. పాత పథకానికి పేరుమార్చి హడావుడి చేస్తున్నారు. టీడీపీ డ్వాక్రా రుణమాఫీ, పసుపు-కుంకుమ పథకాల కోసం ఏకంగా రూ.21 కోట్లు

చెల్లించాం అన్నారు. 

జగన్ రెడ్డి ఇస్తున్నది రూ.6,792 కోట్లు మాత్రమే. టీడీపీ హయాంలో దాదాపు 93లక్షల మంది డ్వాక్రా మహిళలకు పసుపు కుంకుమ, డ్వాక్రా రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తే, చంద్రబాబు కన్నా ఎక్కువ బడ్జెట్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 87లక్షల మందికే కుదించడం మహిళా సంఘాలను వంచించడమేనన్నారు. 

ఆరు

లక్షల మంది మహిళలకు అందాల్సిన లబ్దిపై జగన్ రెడ్డి మోసం చేశారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం కింద టీడీపీ రూ.2,540 కోట్లు చెల్లిస్తే.. జగన్ రెడ్డి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారు. వడ్డీ రాయితీలకు మంగళం పాడారన్నారు. 

ఆసరా పేరుతో హడావుడి చేస్తూ... రుణాలు తీసుకుని.. బ్యాంకులకు ఇంకా చెల్లించని మొండి బకాయిలకు

మాత్రమే పథకాన్ని వర్తింపజేస్తూ.. రుణాలను సకాలంలో చెల్లించిన వారిని అన్యాయం చేస్తున్నారు.

 అదే సమయంలో రుణాలు తీసుకుని బ్యాంకులకు చెల్లించి, ఉపాధి నిమిత్తం వలస వెళ్లినవారికి కూడా ఆసరా దూరం చేస్తున్నారు. రుణాలను సకాలంలో చెల్లించిన వారికి, వసల వెళ్లిన వారికి కూడా ఆసరా పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్

చేస్తున్నామన్నారు. 

వడ్డీ రాయితీలపై నాడు ప్రసంగాలు ఊదరగొట్టి.. నేడు మహిళా సంఘాల రుణాలకు సంబంధించిన వడ్డీ రాయితీ ఎందుకు చెల్లించడం లేదు అని ప్రశ్నించారు.

ప్రజల సొమ్ముతో పత్రికల్లో ప్రకటనలు, ప్రచారాలు చేసుకుంటూ.. గత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం అధికార దుర్వినియోగమేనన్నారు. 

తప్పు

చేస్తూ.. ఎదుటి వారు తప్పు చేశారని చూపించేలా మాట్లాడడం జగన్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలకు నిదర్శనం అన్నారు. 

 జగన్మోహన్ రెడ్డి తన క్విడ్ ప్రో కో విధానాలు, క్రిమినల్ మైండ్ సెట్ తో ఏకంగా మహిళా సంఘాలను కూడా వంచించేందుకు సిద్ధపడడం రాజకీయంగా దిగజారుడు తనమే. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ రాక్షసత్వాన్ని, కుటిల

హామీలపై తెలుగుదేశం ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటుందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam