DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయం లో దోపిడీని అడ్డుకున్నందుకు ముగ్గురు అర్చకుల హత్య!!

*కర్ణాటక లో ముగ్గురు అర్చకులు అత్యంత కిరాతకంగా హత్య*

*మండ్య పట్టణం లోని అర్కేశ్వర ఆలయ హుండీ దోపిడీ*

*(DNS report : Acharyulu SV, బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, September 12, 2020 (DNS):* హిందూ ఆలయాలు, సంప్రదాయాలపై జరుగుతున్నా దాడులకు మరో ప్రత్యక్ష నిదర్శనం కర్ణాటకలో ముగ్గురు అర్చకులను అత్యంత కిరాతకంగా హత్య

కావించడమే. కర్ణాటకలోని మండ్య పట్టణం శివారున ఉన్న అర్కేశ్వర ఆలయానికి చెందిన ముగ్గురు పూజారులు గణేశ జి (55), ప్రకాశ్‌ జి (58), ఆనంద్‌ జి (40) లను దుండగులు హత్య చేసి ఆలయం వెలపల కొలను వద్ద పారేశారు. ఆలయం లోని హుండీలను కొల్లగొట్టి. కానుకల్ని దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనతో మొత్తం మండ్య పట్టణం దద్దరిల్లిపోయింది. ఆలయాన్ని

దోచుకునేందుకు వచ్చిన ముష్కరులను అడ్డుకున్నందుకు ఈ అర్చకులను అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు భక్తులు భావిస్తున్నారు. ఆలయంలో పూజారులుగా ఉన్న వీరు ఆలయ రక్షణ కోసం ముగ్గురూ   రాత్రివేళ అక్కడే నిద్రించేవారు. ఎప్పటిలాగే ప్రధాన ద్వారానికి తాళం వేసి లోపలి వైపున నిద్రించారు. ప్రహరీని దూకి లోపలికి ప్రవేశించిన దుండగులు

బండరాళ్లతో కొట్టి వీరిని హతమార్చి, మూడు హుండీల్ని ఎత్తుకెళ్లారు. ఆలయ సమీపంలోని పుష్కరిణి వద్ద వాటిని పగలగొట్టి నగదు, నగల్ని దోచుకుపోయారు.
కాగా, ప్రస్తుతన్ కర్ణాటక లో భారతీయ జనతా పార్టీ అధికారం లో ఉన్న విషయం తెలిసిందే. హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నామని, దేవాలయ వ్యవస్థను పరిరక్షిస్తామని హామీలు ఇచ్చే బీజేపీ

హయాంలో ఉన్న రాష్ట్రంలోనే ఇలా జరగడం అత్యంత దారుణమని భక్తులు మండిపడుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam