DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజన్న ఒక అడుగు వేస్తే జగనన్న రెండు అడుగులు: మంత్రి వనిత

వైయస్సార్ ఆసరా సంబరాలలో  మంత్రి తానేటి వనిత 

(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)

అమరావతి, September 12, 2020 (DNS): సంక్షేమ పధకాల అమలు లో రాజన్న ఒక అడుగు వేస్తే జగనన్న రెండు అడుగులు వేస్తున్నారని, రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వురు నియోజకవర్గంలో,

కొవ్వూరు పురపాలక సంఘ కార్యాలయం లో ఏర్పాటుచేసిన  వైయస్సార్ ఆసరా సంబరాలలో మంత్రి తానేటి వనిత, కొవ్వూరు ఆర్.డి.ఓ  బి. లక్ష్మారెడ్డి,  కొవ్వూరు మున్సిపల్ కమిషనర్ కె.టి. సుధాకర్ లు పాల్గొన్నారు. కోటి మంది అక్క చెల్లెమ్మల కోటి, కోటి దీవెనలు అన్న నినాదంతో మార్మోగిన  కొవ్వూరు పురపాలక సంఘ  ప్రాంగణం

మారుమ్రోగిందన్నారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  మహిళల పక్షపాతి అని, జగనన్న  ప్రవేశ పెట్టిన ఈ పధకం మహిళల అభివృద్ధి కి పునాది అన్నారు. చిన్నపిల్లలతో మొదలు పెట్టి గర్భిణీలకు, బాలింతలకు,45 సంవత్సరాలు నిండిన వెనకబడిన మహిళలకు, వృద్ధులకు ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని

పరిపాలన సాగిస్తున్నారన్నారు. 

మహిళలకు ఇచ్చిన మాట కోసం రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే  మద్యాన్ని కూడా దశల వారిగా తగ్గిస్తూ.. వారి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బలపడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం హర్షించదగిన విషయం అన్నారు. 

వైయస్సార్ సంపూర్ణ పోషణ మరియు పోషణ ప్లస్ యొక్క పధకాల గురించి

పూర్తిస్థాయిలో మహిళలకు మంత్రి తానేటి వనిత అవగాహన కల్పించారు.  వైస్సార్ ఆసరా గురించి మహిళలకు  వివరించారు.  తదుపరి ఆసరా సంబరాలలో భాగంగా, కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా మంత్రి  తానేటి వనితను శాలువా, గజమాలతో డ్వాక్రా సంఘాల మహిళలు సమ్మానించారు. 
ఈ కార్యక్రమంలో చాగల్లు మండల  ఎం.డి.వో రాంప్రసాద్ , మూడు మండలాల

 డ్వాక్రా సంఘాల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్స్, సంబంధిత అధికారులు, మహిళలు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam