DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర ఎంపీలకు కరోనా పాజిటివ్, ఢిల్లీ లో చికిత్స.

*స్వల్ప లక్షణాలు ఉన్నా సభలోకి అనుమతి లేదు:స్పీకర్*

*(DNS report : Acharyulu SV, బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, September 14, 2020 (DNS):* ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యులు కరోనా పాజిటివ్ తో ఢిల్లీ లో చికిత్స పొందుతున్నారు. సోమవారం నుంచి మొదలు కానున్న పార్లమెంట్ సభ సమావేశాలలో పాల్గొనేందుకు ఢిల్లీ కి వచ్చిన ఎంపీ

లందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమం లోనే విశాఖ జిల్లా అరకు ఎంపీ గొట్టేటి మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప లకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారు రెండు వారల పాటు ఢిల్లీ ల్లోనే ఉండీ చికిత్స పొందనున్నారు. వీరిలో అరకు ఎంపీ జ్వరంతో బాధపడుతున్నట్టు  తేలింది, కాగా రెడ్డప్ప కు ఎటువంటి లక్షణాలు లేకుండానే

పాజిటివ్ గా ఫలితం రావడం తో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని అధికారులు సూచించారు. కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి కూడా పరీక్షలు నిర్వహించారు. అనుమానం వచ్చిన వారిని కూడా సభలోకి అనుమతించక పోవడంతో లోక్ సభ లో సంఖ్యా కొంత పలచగానే కనిపించింది. 

కాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఎంపీ వంగ గీత కు గత శనివారం ఆమెకు

నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశవ్యాప్తంగా 24 మంది ఎంపీలకు, 8 మంది కేంద్రమంత్రులకు కరోనా పాజిటవ్‌గా తేలింది. ఇక స్వల్ప లక్షణాలు ఉన్నా.. సభలోకి అనుమతి లేదని స్పీకర్‌ ఇదివరకే ప్రకటించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam