DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రశాంతంగా నన్నయ ఫైనల్ డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రారంభం

*ఉభయ గోదావరి జిల్లాల్లో 139 పరీక్ష కేంద్రాలు, 97 % హాజరు*

*కోవిడ్ రూల్సు కచ్చితంగా అమలు చేయాలి: వీసీ జగన్నాధరావు*

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 14, 2020 (DNS):* ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ మరియు పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు సోమవారం నుండి ప్రారంభమై

ప్రశాంతంగా జరిగాయి. విశ్వవిద్యాలయ క్యాంపస్ లోని పరీక్షా కేంద్రాలను, గైట్ కళాశాల మరియు కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాలలోని పరీక్ష కేంద్రాలను వీసీ ఆచార్య మొక్కా జగన్నాథరావు పరిశీలించారు. పరీక్షల నిర్వహణ, కోవిడ్ నిబంధనల అమలు తదితర అంశాలను క్షుణంగా పరిశీలించారు. దీనికి సంబంధించి వీసీ మాట్లాడుతూ ఉభయగోదావరి

జిల్లాల్లోని 139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసామని వీటిలో 113 డిగ్రీ పరీక్ష కేంద్రాలుగాను, 26 పీజీ పరీక్షా కేంద్రాలుగాను విభజించి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు 23 వేల మంది, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షలు 4200 మంది విద్యార్థులు వ్రాయల్సి ఉండగా 97 శాతం విద్యార్థులు హాజరై పరీక్షలు

వ్రాస్తున్నారని తెలిపారు. కోవిడ్ నేపధ్యంలో విద్యార్థులను భౌతిక దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు వేరువేరు గా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. డిగ్రీ సైన్స్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకూ, ఆర్ట్స్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని

అన్నారు. అలాగే పీజీ ఆర్ట్స్ అండ్ కామర్స్ విద్యార్థులకు సెప్టెంబర్ 14వ తేది నుండి 24వ తేది వరకు పరీక్షలు జరుగుతున్నాయని సైన్స్ విద్యార్థులకు సెప్టెంబర్ 28వ తేది నుండి అక్టోబర్ 5వ తేది వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. కోవిడ్ నేపధ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో సైన్స్, ఆర్ట్స్

విద్యార్థులకు వేరువేరు పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక రుపొందించామని అన్నారు. కోవిడ్ కట్టడికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ రూమ్ కి 12 మంది చొప్పున బెంచ్ కి ఒక్కరు చొప్పున పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. తరువాత పరీక్షా కేంద్రాలలో నిర్వహకులతో మాట్లాడుతూ విద్యార్థులు పరీక్ష కేంద్రాల వద్ద గుంపులుగా లేకుండా

జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద దర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి మాస్క్ ఉన్న వారినే పరీక్ష గదిలోని అనుమతించాలని చెప్పారు. పరీక్ష గదిలోనికి వచ్చినప్పుడు పరీక్ష అనంతరం వెళ్ళినప్పుడు ప్రతీ విద్యార్థి చేతులను సేనిటేజర్లుతో శుభ్రం చేసుకోనే విధంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతీ పరీక్ష

తరువాత హైపోక్లోరైడ్ ద్రావనాన్ని పిచికారి చేయించి పరీక్ష కేంద్రాలను శుభ్రపరచాలని ఆయా పరీక్ష కేంద్రాల వద్ద నిర్వహకులకు సూచించారు. ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లు, పరీక్ష నిర్వహణ సిబ్బంది వంటి వారు మాస్కులు, గ్లౌజులు దరించి పరీక్షలు నిర్వచాలని కోవిడ్ నిబందనలను తప్పని సరిగా పాటించాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో

 కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్నేషన్ ఎస్.లింగారెడ్డి, ప్రిన్సిపాల్స్ కె. శ్రీ రమేష్, డా.కె.రమనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam