DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల వద్ద సిసి కెమెరాల ఏర్పాటు పరిశీలన

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 14, 2020 (DNS):* పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె నారాయణ్ నాయక్ ఆదేశాలపై నరసాపురం డి.యస్.పి కె. నాగేశ్వరరావు పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరం , జుత్తిక గ్రామాలలో  శివాలయం టెంపుల్ ను,  సదరు దేవాలయం నందు ఉన్న రధమును దేవాలయ ప్రాంతాన్ని అంత పరిశీలన చేసి, దేవాలయ ప్రాంగణంలో సీసీ

కెమెరాలు యొక్క పరిస్థితులను వాటి యొక్క  స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలన చేశారు. 
ఈ సందర్భంగా డిఎస్పీ సదరు ప్రాంతంలో అగ్నిప్రమాద నియంత్రణ కొరకు ఉపయోగించే పనిముట్లను మరియు దేవాలయ ప్రాంగణంలో విద్యుత్ వైర్లను పరిశీలన చేసి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి, దేవాలయము పూజారి లకు తగిన సూచనలు సలహాలు డీఎస్పీ

ఇచ్చినారు. పెనుమంట్ర మండలం లో  ఉన్న దేవాలయాలు, చర్చిలు, మసీదుల కు సంబంధించిన వివరాలను స్టేషన్ బీట్ బుక్ లలో నమోదు చేయాలి అని పెనుమంట్ర ఎస్ ఐ ఎస్. ఎన్. వి.వి. రమేష్ కి ఆదేశాలిస్తూ ప్రార్ధనా స్థలాలు వద్ద పాయింట్ బుక్ ను ఏర్పాటు చేయించారు. దేవాలయాల యొక్క కమిటీ సభ్యులతో సమావేశము ఏర్పాటు చేసి  ఏ విధమైన సంఘటనలు జరగకుండా

నివారించుట కొరకు పీస్ కమిటీల యొక్క వివరములను సేకరించి వారితో సమావేశాలు ఏర్పాటు చేయాలని దేవాలయ పరిసర ప్రాంతాలను అధికారులు తరచుగా సందర్శించాలని, కమిటీ సభ్యులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి ఏవిధమైన సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిఎస్పీ తెలియజేసినారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam