DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రవరికీ పూర్వ ఆకృతిలోనే అంతర్వేది రథం నిర్మాణం

*దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు వెల్లడి*

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 14, 2020 (DNS):* వచ్చే 2021  ఫిబ్రవరిలో తూర్పు గోదావరి జిల్లా  అంతర్వేది లోని శ్రీ లక్ష్మి నృసింహ స్వామి వారి కల్యాణోత్సవాలు జరుగుతాయని, ఆ నాటికి అత్యద్భుతమైన రధాన్ని పూర్వ ఆకృతిలోనే సిద్ధం

చేస్తున్నామని  దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు తెలియచేసారు. సొమ‌వారం బ్రాహ్మ‌ణ వీధిలో దేవ‌దాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాల‌యంలో దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు‌తో మంత్రి వెలంప‌ల్లి స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది

లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త రథం నిర్మాణానికి ఆకృతి సిద్ధమైందన్నారు. అంద‌రి అభిప్రాయంల మేర‌కు రథం ఆకృతిలో ఎటువంటి మార్పులు లేకుండా రథాన్ని సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను అదేశించిన్న‌ట్లు పేర్కొన్నారు. రథం నిర్మాణంపై చర్చించి ఆకృతిని తయారు చేయించారన్నారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు

వచ్చేలా ఆకృతి రూపొందించారన్నారు. ఆరు చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని ఏడు అంతస్తుల్లా రూపొందిస్తున్నారు.  కొత్త రథం నిర్మాణంతో పాటు....ర‌థ‌శాల మరమ్మతులు నిమిత్తం రూ.95 లక్షలు ఖర్చవుతుందని దేవదాయశాఖ  ఆధ్వర్యంలో ప్రతిపాదనలు రూపొందించడం జ‌రిగింద‌న్నారు. స‌మావేశంలో దేవ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్ పి.అర్జున‌రావు,

ఎస్ఈ శ్రీ‌నివాస‌రావు ఉన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam