DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజల ప్రాణాలంటే వైసిపికి లెక్కలేకుండా పోయింది: 

*రాష్ట్రంలో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేదు, మాట్లాడే హక్కు లేదు.* 

*టిడిపి నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 15, 2020 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వానికి  ప్రజల ప్రాణాలంటే వైసిపికి లెక్కలేకుండా పోయిందని,

రాష్ట్రంలో స్వేచ్చగా తిరిగే పరిస్థితి లేదు, మాట్లాడే హక్కు లేదు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం రాష్ట్రంలోని  175 నియోజకవర్గాల టిడిపి అభ్యర్ధులు, ప్రజాప్రతినిధులు, టిడిపి సీనియర్ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఉన్మాదుల భజన చేయకపోతే ఉసురు తీస్తున్నారని, ప్రాథమిక హక్కులనే కాదు,

జీవించే హక్కును కూడా కాలరాస్తున్నారన్నారు.  ఏడాదిన్నరలో ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేసిందని, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనదన్నారు.  అవినీతిని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదే న్నీ తెలిపారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి తప్ప ఒక వర్గానికి, పార్టీకి కార్యకర్తలు గా

పనిచెయ్యరాదన్నారు. ప్రతిపక్షాన్ని అణిచేయాలని పోలీసులు చూడరాదని, 
ప్రశ్నించే గొంతును నొక్కేయాలని ప్రయత్నించ కూడదన్నారు. బాధిత వర్గాలకు అండగా పోలీసు వ్యవస్థ ఉండాలని, సిగ్గుఎగ్గు లేకుండా వైసిపి వ్యవహరిస్తోందని తెలిపారు. 

ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదని, భక్తుల మనోభావాలను

గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  ఏ మతం విశ్వాసాలను దెబ్బతీసినా సహించేది లేదని తెలిపారు. ధార్మిక సంస్థలపై, ఆలయాలపై దాడులు పెరగడం భాధాకరం అంతర్వేది సహా అన్ని దేవాలయాల్లో జరిగిన దాడులపై సిబిఐ విచారణ జరపాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam