DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్లాస్మా దానం చేసి ప్రాణదాతలుగా నిలవండి. :ఎస్పీ అమిత్ 

*(DNS report : Acharyulu SV, బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, September 15, 2020 (DNS):* ప్లాస్మా దానం చేసి, మరో ప్రాణాన్ని నిలపాలని 
జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో ఇటీవల కరోనా వైరస్ బారినపడి విజేతలుగా నిలిచినా వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. జిల్లా

పోలీసు సిబ్బంది  కొవీడ్ హాస్పిటల్లో మరియు హోమ్ ఐస్లోషన్ లో ఉండి చికిత్స పొంది జిల్లా ఇచ్చిన స్పూర్తితో విజయవంతంగా కోలుకొని తిరిగి విధులకు హాజరైన 40 మంది జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ పూలమాలలుతో అపూర్వ ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజా సేవకు

పునరంకితమైన పోలీసు వీరుల ధైర్యాన్ని మరియు మనోబలాన్ని అభినందించుట కొరకు ఇచ్చట అభినందన సభ ఏర్పాటు చేసి మీకు ఆహ్వానం పలకడం జరిగిందని,  మీరు త్వరగా కొలుకోని మిగతా సిబ్బందికి స్పూర్తి దాయకంగా నిలవడం చాలా మంచి శుభ పరిణామముని,  కరోనా నీ జయించిన సిబ్బంది ప్లాస్మా దానం చేయడానికి సిద్దంగా ఉండాలి అని దానివలన ఎదుట వారికి

ప్రాణ దాతలు అవుతారు అని,విధి నిర్వహణలో చిన్న తప్పిదం వలన మీరు కరోనా బారినపడిడం జరిగిందిని అలాంటి అజాగ్రత్తలు పునరావృతం కాకుండా చూచుకుంటు మంచి పౌష్టికాహారమైన ఆహారాన్ని తీసుకుంటు, శారీరికంగాను,మానసికంగాను ధైర్యంగా ఉండాలని,ఉద్యోగ నిర్వహణలో ఎవ్వరు కుడా కరోనా వైరస్ బారిన పడకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని

తెలుపుతూ కరోనాను జయించిన  సిబ్బందికి  పూలమాలలుతో సత్కరంచారు.
ఈ కార్యక్రమంలో  ఈ కార్యక్రమంలో  శ్రీకాకుళం 2 టౌన్ సి ఐ పి. వి. రమణ, ఎస్.బి సిఐ శంకరరావు, ఆర్ఐలు ప్రదిప్, ఉమా మహేష్,గారుల మరియు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam