DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత్ బ్రాండ్ ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలి: రామ్ మాధవ్

*భారత స్వావలంబన సాధనలో యువత పాత్ర కీలకం*

*దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చెయ్యడం లో ముందుండాలి*

*ఆత్మ నిర్భర్ అంటే స్వదేశీ మాత్రమే కాదు, భాద్యత కూడా.*  

*వెబినార్ లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పిలుపు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం,

సెప్టెంబర్ 16, 2020 (డి ఎన్ ఎస్):* భారత్ దేశం లో అత్యద్భుతమైన భారత్ బ్రాండ్ ఉత్పత్తులను ప్రపంచానికి అందించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సప్తాహం లో భాగంగా భారతీయ జనతా యువ మోర్చా ( బీజేవైఎం) మహారాష్ట్ర విభాగం నిర్వహించిన మొట్ట మొదటి

వెనిబర్ కార్యక్రమంలో దేశ యువతను ఉద్దేశించి రామ్ మాధవ్ ప్రసంగించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత్ లో ఎంతో మేధాసంపత్తి ఉందని, వారందరికీ మార్గదర్శకం చేసేందుకు నరేంద్ర మోడీ సారధ్యంలోని  కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దానిలో భాగంగా ఆత్మ నిర్భర్ ఉద్యమాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఆత్మ నిర్భర్ అంటే కేవలం

స్వదేశీ ఉత్పత్తులు తయారు చెయ్యడం మాత్రమే కాదని, భారత దేశ వృద్ధిలో భాద్యత ను తీసుకోవడం కూడా అన్నారు. భారత స్వావలంబన సాధనలో యువత పాత్ర కీలకం వహించాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలకు అతీతంగా సామర్ధ్యం, మేధస్సు కల్గిన ప్రతి ఒక్కరికీ చేయూత  ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. భారత దేశ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం

చెయ్యడం లో ముందుండాలి ని పిలుపునిచ్చారు. భారత దేశ ఆర్ధిక, సామాజిక, పారిశ్రామిక రక్షణ తదితర అంశాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గతంలో భారత్ భూ భాగాన్ని ఆక్రమించుకుని, దేశంలో అల్లకల్లోకాలం సృష్టించిన పరిస్థితుల నుంచి, వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిన పరిస్థితి నరేంద్ర మోడీ కల్పించారన్నారు. జన్ ధన్ యోజన

పేరిట నిరుపేదలకు బ్యాంకు అకౌంట్ లను ప్రారంభించారన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ముద్ర ఋణాలు అందించామన్నారు. కరోనా కట్టడి కాలం తదుపరి దేశ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి రూ. 20 లక్షల కోట్ల ఆర్ధిక పేకేజీ ను ప్రధాని ప్రకటించారన్నారు. 

బీజేవైఎం మహారాష్ట్ర శాఖ నిర్వహించిన ఈ వెబినార్ కార్యక్రమం లో

మహారాష్ట్ర బీజేవైఎం అధ్యక్షులు విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ భారత్ దేశ మార్గదర్శి భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ జన్మదినోత్సవాన్ని జనాన్ని ఉత్తేజిత పరిచేందుకు బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్ సూచనల మేరకు ఈ వెబినార్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
బీజేవైఎం జాతీయ ఉపాధ్యక్షులు అతుల్

కుమార్, బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు, ఢిల్లీ రాష్ట్ర ఇంచార్జి మన్ మోహన్ ఠాకూర్ తదితరులు ప్రత్యక్షంగా వెబినార్ లో జాతీయ యువ మోర్చా సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. 

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి భారీ సంఖ్య లో బీజేవైఎం కార్యకర్తలు, బీజేపీ

అభిమానులు ఈ వెబినార్ ను పేస్ బుక్, యు ట్యూబ్, ట్విట్టర్, తదితర వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా దేశ వ్యాప్తంగా వీక్షించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam