DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాలయ వ్యవస్థ రక్షణలో జగన్ ప్రభుత్వం ఘోర వైఫల్యం

*ఆలయ వ్యవస్థ పై ప్రభుత్వానికి భాద్యత, విశ్వాసం లేవు* 

*దుర్గ గుడి పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 16, 2020 (డి ఎన్ ఎస్):* దేవాలయ వ్యవస్థ రక్షణలో ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఘోర వైఫల్యం

చెందిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మండిపడ్డారు. మంగళవారం విజయవాడ కనక దుర్గ ఆలయంలోని వెండి రథంపై ఉన్నమూడు వెండి సింహాలు దొంగతనానికి గురికావడం పై అయన మండిపడ్డారు. బుధవారం ఆలయాన్ని దర్శించిన అయన ఆలయంలోని రధాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా అయన ఈఓ సురేష్ బాబు ను ఈ చోరీ విషయంపై వివరాలు అడిగి

తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఆలయ వ్యవస్థ పై ప్రభుత్వానికి భాద్యత, విశ్వాసం లేవన్నారు. గత 15 నెలల కాలం లో రాష్ట్రంలో వరుసగా హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థలపై భౌతిక దాడులు జరుగుతున్నా, ఆలయాల్లోని మూలవరుల రథాలు  తగులబెట్టి, కాల్చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టునట్టు కూడా లేదని

మండిపడ్డారు. 

రాష్ట్రంలోనే తిరుమల తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యత ఉన్న ఆలయం కనక దుర్గగుడిలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన రధం నిర్మాణంలో నాలుగు సింహాలను అమర్చారన్నారు. అయితే ప్రస్తుతం వాటిలో మూడు సింహాలు కనుమరుగవ్వడం, మిగిలిన ఒకటి కూడా అసంపూర్ణంగా కనిపించడం చూస్తుంటే, ఆలయ అధికారుల నిర్లక్ష్యం, పవిత్రతను

కాపాడే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన పరిస్థితులు ఉత్పన్న మవుతున్నాయన్నారు. ఆలయ అధికారి ఆధీనంలో ఉండే రక్షణ వ్యవస్థ సరియైన పద్దతి అవలంబించని వైఖరిని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం సంబంధిత విచారణ చేసి 2 రోజుల్లోనే ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిందిగా డిమాండ్ చేసారు. 

ఈ ఆలయ పర్యటనలో

విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రతినిధి రవి, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ, తదితర సీనియర్ నాయకులు వీర్రాజుతో కలిసి పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam