DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ ఆలయాల్లో దాడి పై ఏపీ గవర్నర్ కు  బీజేపీ ఫిర్యాదు

*(DNS report : Sairam CVS, బ్యూరో, విశాఖపట్నం)* 

*విజయవాడ / విశాఖపట్నం, సెప్టెంబర్ 16, 2020 (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలోని ప్రసిద్ధ హిందూ దేవాలయలపై దాడులు, రథాల ధ్వంసం, ప్రభుత్వ వైఫల్యం పై ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ కు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బృందం ఫిర్యాదు చేసింది. బుధవారం ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

సోము వీర్రాజు నేతృత్వంలో, మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి రవి, తదితరులు కలిశారు. ఈ సందర్భంగా గత 15 నెలల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ హిందూ ఆలయాలపై జరిగిన దాడులు, పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం తదితర అంశాలను వివరించారు. ఇదే నెలలో తూర్పు

గోదావరి జిల్లా అంతర్వేది లోని లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో అత్యంత ప్రాధాన్యత కల్గిన స్వామి రథాన్ని అన్యమత మతోన్మాదులు ధ్వంసం చేస్తే ఇంతవరకూ పట్టుకోడం ప్రభుత్వానికి చేతకాలేదన్నారు. పైగా దీనిపై శాంతియుతంగా నిరసన చేస్తున్న హిందూ ధార్మిక ప్రతినిధులు 43 మందిపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైల్లో

పెట్టారన్నారు. 
  హిందూ దేవాలయాలు పై జరుగుతున్న వరుస దాడుల నేపధ్యంలో పలు అంశాల పట్ల గవర్నర్ గారితో చర్చించి, వినతిపత్రం అందచేశారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam