DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సచివాలయం ద్వారానే అన్ని సేవలు: జేసీ కీర్తి చేకూరి

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 17, 2020 (డి ఎన్ ఎస్ ):* ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వార్డు,గ్రామ సచివాలయంల ద్వారానే ప్రజలు అన్నిసేవలు పొందొచ్చని తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. గురువారం మండపేట గాంధీనగర్ లోని 12 వ సచివాలయన్ని సందర్శించి

ఉద్యోగుల కు పలు సూచనలు చేశారు. ఇక ఏ పనులైన సచివాలయం ద్వారానే చేపడతారని పేర్కొన్నారు. ఏ కార్యాలయం కు ప్రజలు తిరగాల్సిన పని లేదన్నారు.సచివాలయం కు వచ్చి సేవలు పొందే అవకాశం ఉందన్నారు. మునిసిపల్, రెవెన్యూశాఖ అన్ని సేవలు సచివాలయంలో అందుబాటులో కి వచ్చాయన్నారు. ప్రతి సచివాలయంలో ప్రభుత్వం అందిస్తున్న సేవలకు సంబంధించిన

బోర్డులు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. సాంకేతిక ఇబ్బందులు తలెత్తిన సమయంలో ఉద్యోగులు చేపడుతున్న చర్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్యదర్శి లు విధులు ఎలా నిర్వహిస్తున్న రని కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ ను అడిగారు. ఉదయం నుండి వారు విధుల్లో వచ్చి నిర్వహణ పర్యవేక్షణ చేపడుతున్నారని కమిషనర్

తెలిపారు. సచివాలయంలో ని అన్ని శాఖ లకు సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రామ్ కుమార్, తహశీల్దార్ టి ఆర్ రాజేశ్వరరావు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam