DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చలో అమలాపురం విజయవంతం. .భారీ సంఖ్యలో అరెస్టు

*హిందూ ధర్మ రక్షణకై కదిలి వచ్చిన కాషాయ ధ్వజం, యువ శక్తి*

*అమలాపురం వేదిక వద్ద ఎమ్మెల్సీ మాధవ్, పలువురు అరెస్ట్*

*బీజేపీ అగ్రనేతల ముందస్తు అరెస్టు, అయినా ఆగని నిరసన గళం* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 18, 2020 (డి ఎన్ ఎస్):* రాష్ట్రంలో హిందూ ఆలయాలను

రక్షించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర శాఖ శుక్రవారం చేపట్టిన చలో అమలాపురం విజయవంతం అయ్యింది. రాష్ట్రంలో హిందూ దేవాలయ వ్యవస్థ, ధార్మిక రక్షణకై జరుగుతున్న పోరాటంలో ఇది ఒక ఆరంభం మాత్రమేనని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ అన్నారు. 
ఈ నిరసనల్లో పాల్గొనేందుకు బయలుదేరుతున్న అగ్రనాయకులు,

బీజేపీ, సంఘ్ పరివార్ ప్రతినిధులను ఎక్కడికక్కడే ముందస్తు అరెస్టు లు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మి నారాయణ, ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే పి విష్ణు కుమార్ రాజు, తదితరులను హౌస్ అరెస్ట్ లు చేసారు. కాగా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిని అమలాపురం సమీపంలో గురువారం

అర్ధరాత్రి అరెస్ట్ చేయగా, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ మాత్రం అమలాపురం చేరుకున్నారు. శుక్రవారం ఉదయం నిర్దేశిత ధర్నా ప్రాంతంలో నిరసనలు చేస్తున్న సమయంలో మాధవ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని తుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

ఈ సందర్బంగా మాధవ్ ప్రభుత్వ

తీరును తీవ్రంగా ఎండగట్టారు. 

రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పాలన సాగుతోంది:. . ..

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ వ్యతిరేక పాలన సాగుతోందని, గత 15 నెలల రాష్ట్ర ప్రభుత్వ కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు, రథాలను తగులబెడుతున్న అన్యమత ఘాతక, పిచ్చొళ్ళు చేస్తున్నదాడుల నుంచి రక్షించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత నిరసనలు

చేసిన హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేసి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, జైలు పాలు చేయడం జరిగిందన్నారు. ఈ రాష్ట్రంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని, అన్యమత ఘాతక  పిచ్చొళ్ళు, విపరీతంగా పెరిగిపోయారని, వీళ్ళు చేస్తున్న ఘాతుకాలను గత 15 నెలలుగా ఓర్చుకున్నామని, అయితే తూర్పు గోదావరి జిల్లా

అంతర్వేది లక్ష్మి నృసింహ స్వామి ఆలయంలో స్వామి రథాన్ని అత్యంత కిరాతకంగా కాల్చివేస్తే. . . హిందూ సమాజం సహించలేక ఒక్కసారిగా శాంతియుత నిరసనలు చేసిందన్నారు. దీన్ని సహించలేని ప్రభుత్వం హిందూ యువతపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిందన్నారు. దీనికి వ్యతిరేకంగా చలో అమలాపురం పిలుపు ఇచ్చామన్నారు. విజయవంతంగా అమలాపురం

లో నిరసన గళం వినిపించమన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam