DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పగో జిల్లాలో జగనన్న పచ్చతోరణానికే కుచ్చు టోపీ

*అటవీ శాఖా లో ఇద్దరు అవినీతి అధికారుల పై వేటు* 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 18, 2020 (డి ఎన్ ఎస్ ):* పశ్చిమ గోదావరి జిల్లాలో జగనన్న పచ్చతోరణం పథకం ద్వారా రైతులకు అందించవలసిన కొబ్బరి మొక్కలను వీరు అమ్ముకున్నట్టు తేలింది. 
వన్య సంరక్షణ చెయ్యవలసిన అటవీ శాఖా అధికారులే

అడ్డదారులు తొక్కడంతో వారిపై వేటు వేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా అటవీ శాఖా లో డీఎఫ్ ఓ గా పని చేస్తున్న ఎం. శ్రీనివాసరావు, ఫారెస్ట్ రేంజర్ బి. కొండలరావులు ప్రభుత్వ ఆదేశాలకు భిన్నంగా కొబ్బరి మొక్కలను అక్రమం గా అమ్ముకున్నట్టు విచారణలో తేలడంతో వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ రాజమహేంద్రవరం

అటవీ శాఖా చీఫ్ కన్జర్వేటర్ ఎన్. నాగేశ్వరావు నిర్ణయం తీసుకున్నారు. 

జగనన్న పచ్చతోరణం పథకం అమలు పై ఫిర్యాదు రావడంతో నాగేశ్వర రావు విచారణ జరిపించారు. వీరి నిర్వాకం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకానికి గండి పడినట్టయ్యింది. రైతులకు అందవలసిన సబ్సిడీ లబ్ది, అక్రమంగా తిరిగి అదే వ్యాపారులకు అమ్మడంతో  పలు

వివాదాలకు తావిచ్చింది. తద్వారా భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. 
పశ్చిమ గోదావరి జిల్లా టి. నరసాపురం లోని ఒక నర్సరీ నుంచి భారీ మొత్తంలో తరలి పోతున్న కొబ్బరి మొక్కలను స్థానికులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో అవినీతి తెనేపుట్ట కదిలింది. ఒక్కో మొక్కను రూ.  10 కి రైతులకు అందించాల్సి ఉండగా,

వ్యాపారులకే తిరిగి అమ్మినట్టు లెక్కలు చూపించినట్టు తెలుస్తోంది. ఈ విచారణ పూర్తిగా జరిగిన తదుపరి కుంభకోణం లెక్కలు బహిర్గతం కానున్నాయి. డిఎఫ్ఓ పై గతంలోనూ పలు ఆరోపణలు వచ్చినట్టు అటవీశాఖ అధికారులు తెలియచేస్తున్నారు. ఇతని సస్పెన్షన్ తో, ఈ విధులను నిర్వహించేందుకు  జిల్లా డీఎఫ్ ఓ యశోద దేవికి అప్పగించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam