DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి కి ప్రత్యేక చట్టం ఉంది, మార్చడానికి వీళ్ళెవరూ?

*అన్యమత డిక్లరేషన్ రద్దు పై నర్సాపురం ఎంపీ మండిపాటు* 

*నేడు డిక్లరేషన్ వద్దన్నారు, రేపు దుస్తులు ఒకే అంటారా?*

*టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2020 (డి ఎన్ ఎస్):* తిరుమల లో

అన్యమతస్తులు ఎటువంటి డిక్లరేషన్ ఇవ్వనక్కరలేదు అంటూ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. శనివారం ఢిల్లీ లో మీడియా తో మాట్లాడుతూ వేల సంవత్సరాల నుంచి తిరుమలలో అమలవుతున్న సంప్రదాయాలను మార్చడానికి ప్రస్తుత ట్రస్ట్ బోర్డు కు అధికారం

లేదన్నారు. ఈ రోజు డిక్లరేషన్ వద్దన్నారు, రేపు ఎలాంటి బట్టలైనా వేసుకు రావచ్చు, చెప్పులేసుకునైనా వచ్చేయచ్చు అని మారుస్తారని, తిరుమలను ఒక విహార కేంద్రంగా మార్చి, పవిత్రతను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఒక్కరి కోసం తిరుమల నిబంధనలు ఎలా మారుస్తారని ఎద్దేవా చేసారు. తక్షణం

సుబ్బారెడ్డి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. 

ప్రభుత్వ బాండ్ ల్లో టిటిడి నిధులను పెట్టేందుకు సిద్ధపడుతున్న టిటిడి తక్షణం ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేసారు. అదేగనుక జరిగితే . . . రాష్ట్రం లో ప్రశాంతత ఉండే అవకాశం లేదన్నారు. టిటిడి నిధులను ప్రభుత్వానికి తరలించి దోచుకునే

ప్రయత్నాన్ని భక్తులు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోరన్నారు. ప్రతి ఒక్కరూ అడ్డుకుంటాం అన్నారు. తిరుమల వేంకటేశ్వరుని నిధులు దోచుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడిన దాఖలాలు లేవన్నారు. 

తిరుమల లో ఉన్నస్వామీ వెంకట + ఈశు = వెంకటేశు మాత్రమేనని, వెంకట + ఏసు కాదన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam