DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎసై దుర్గారావు కుటుంబానికి ఏలూరు డిఐజి పరామర్శ 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 19, 2020 (డి ఎన్ ఎస్ ):* ఏలూరు రేంజి డిఐజి కె.వి.మోహనరావు కృష్ణాజిల్లా చిలకల్లు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ  కరోనా వైరస్ సంక్రమించి వైద్యం పొందుతూ మృతి చెందిన ఎస్ఐ అల్లు దుర్గారావు స్వగ్రామమైన చీపురు గ్రామము తుని మండలం కు వెళ్లి కుటుంబ సభ్యులను

పరామర్సించారు. దుర్గారావు తల్లిదండ్రులను మరియు వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించి డిఐజి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, అల్లు దుర్గారావు యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. 
ఈ సందర్భంగా ఆయన అల్లు దుర్గారావు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ దుర్గారావుకి ప్రభుత్వ పరంగా రావలసిన అన్ని రాయితీ

లను త్వరగా రప్పించే ఏర్పాటు చేస్తామని, కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం ఇప్పించడం కొరకు ప్రయత్నం త్వరగా చేస్తానని భరోసా ఇచ్చారు. ఉద్యోగ నిర్వహణ నే  ప్రాణంగా భావించిన ఎస్సై మరణం పోలీస్ డిపార్ట్మెంట్ కు తీరని లోటు అని, అల్లు దుర్గారావు కుటుంబ సభ్యులకు కావలసిన అన్ని అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని, అల్లు

దుర్గారావు యొక్క కుటుంబ సభ్యులకు ఏదైనా సమస్య లు  ఉన్న ఎడల స్వయముగా డీఐజీ ని కలవవచ్చును అని హామీ ఇచ్చినారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam