DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ మేయర్ సీటు ను జగన్ గారికి గిఫ్ట్ ఇస్తాం: వాసుపల్లి 

*విశాఖ నుంచి దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి బోణీ..వైకాపా లో చేరిక*

*రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండదు : విజయ సాయి.* 

*ఉప ఎన్నికలకైనా సిద్ధం: ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*అమరావతి /విశాఖపట్నం, సెప్టెంబర్ 19, 2020 (డి ఎన్ ఎస్ ):* త్వరలో జరుగనున్న విశాఖ

మహా నగరపాలక సంస్థ ( జి వి ఎం సి) ఎన్నికల్లో అఖండ మెజారిటీ తో మేయర్ అభ్యర్థి ని గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి గిఫ్ట్ ఇస్తాం: విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రకటించారు. 

శనివారం ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన భేటీ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో విశాఖ దక్షిణ

ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైకాపా లో చేరారు. దీంతో విశాఖ జిల్లా కూడా వైకాపా ఖాతాలోకి పూర్తిగా వెళ్లనుంది. సీఎం భేటీ అనంతరం వాసుపల్లి మాట్లాడుతూ పేదల పాలిట  జగన్మోహనుడే ముఖ్యమంత్రి అని కొనియాడారు. 

గత 15 నెలల పరిపాలనలో గట్సు ఉన్న నాయకుడిగా జగన్ కనిపించారని, అందుకే తన కుమారులతో పాటు పార్టీ లో

చేరినట్టు తెలిపారు. విశాఖ ను రాజధానిగా చేస్తానని ప్రకటన చెయ్యగానే, పూర్తి నమ్మకం కల్గిందన్నారు. మరో సారి అవకాశం ఇచ్చినా తెలుగుదేశం ఈ స్థాయిలో అభివృద్ధి పధకాలను అమలు చేయలేదన్నారు. 

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ లోకి చేరుతున్న ఖాతాలో శనివారం

విశాఖ జిల్లా చేరింది. 

ఈ భేటీ లో కీలక భూమిక వహించిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ సీఎం నాయకత్వంలో పని చేస్తానని చెప్పారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతోందన్నారు. సీఎం వెనుకుండి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మేమంతా కృషి చేస్తాం

అన్నారు. 

రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండదు : విజయ సాయి. 

ఈ రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే ఉండదు అని వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు  విజయ సాయి రెడ్డి ప్రకటించారు. ఈ ప్రకటనతో టీడీపీ శ్రేణుల్లో ఎమ్మెల్యే లు మిగలరు అనే సంకేతం ఇస్తున్నారా అనే సంకేతం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన మాట్లాడుతూ

వాసుపల్లి గణేష్  కుటుంబం విశాఖ ప్రజల కోసం చేస్తున్న సేవలు హర్షణీయం అన్నారు. గణేష్ భారతీయ వాయు సేన లో పనిచేసి, దేశానికి సేవలందించి, ప్రస్తుత యువతరాన్ని కూడా సైన్యం లో చేరేందుకు తర్ఫీదు ఇస్తున్నారన్నారు. 

అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాసుపల్లి గణేష్ కుమార్ కుమారులకు కండువా వేశారు, గణేష్

ప్రస్తుతం పార్టీ సానుభూతి పరునిగా ఉండనున్నారు. వారు పార్టీలోకి రావడం కొండతా బలాన్ని ఇస్తోందన్నారు. 

టీడీపీలో ఈ రోజు విశాఖలో తుడుచుపెట్టుకు పోతుందండంలో సందేహం లేదని, సీఎం చేస్తున్న అభువృద్ధిని గమనించి టీడీపీలో విద్యావంతులు వైఎస్సార్సీపీ లోకి వస్తున్నారు. భవిష్యత్తులో మరింతగా చూస్తారని, చంద్రబాబు కు

ప్రతిపక్షంలో ఉన్నా లేకున్నా పెద్ద తేడా ఉండదని తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam