DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 నుంచీ విద్యా సంవత్సరం లో మొదటి సారి స్కూళ్ళు ప్రారంభం  

*కేవలం 9 వ తరగతి పైబడిన క్లాసుల వారికే అనుమతి. . .* 

*పాఠాలు ఉండవు. పాఠ్యాంశాల్లో సందేహాల నివృత్తి మాత్రమే.* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 20, 2020 (డి ఎన్ ఎస్):* కరోనా కట్టడి, ఆపై లాక్ డౌన్ తర్వాత 2020 -21 విద్యా సంవత్సరం లో ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా మొట్టమొదటి సారిగా

పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, విద్యార్థులకు తరగతులు మాత్రం ఉండవు. పాఠ్యాంశాల్లో ఏమైనా సందేహాలుంటే టీచర్లు నివృత్తి చేస్తారు. ఈ మేరకు అన్ని స్కూళ్లలో సగం మంది టీచర్లు విధులకు హాజరు కానున్నారు.

కేంద్రం వెలువరించిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాల ప్రకారం విద్యాసంస్థలు

తెరుచుకోనున్నాయి. ఆన్‌లైన్‌ తరగతు లు కొనసాగుతున్నందున ఉపాధ్యాయులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఇతర అంశాలపై వివిధ జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. శనివారం వివిధ జిల్లాల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ల్లో టీచర్ల సందేహాలను డీఈవోలు నివృత్తి చేశారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు

విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కొన్ని చోట్ల వారంలో మూడు రోజుల చొప్పున హాజరయ్యేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమై 20 రోజులు అవుతున్నందున పాఠాల వారీగా వర్క్‌షీట్ల పంపిణీ, వాటి ఆధారంగా విద్యార్థుల సామర్థ్యాలను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని టీచర్లను

ఆదేశించారు.

అన్‌లాక్‌-4 సడలింపుల్లో భాగంగా ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల సలహాలు పొందేందుకు, అనుమానాలు నివృత్తి చేసుకునేందుకు తల్లిదండ్రుల అనుమతితో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లవచ్చని కేంద్రం తెలిపింది. 9, 10వ తరగతుల విద్యార్థులకు పాఠ్యాంశాల్లో ఏమైనా అనుమానాలుంటే టీచర్లు నివృత్తి చేస్తారు. ఇంటర్మీడియట్‌

కాలేజీల్లోనూ ఇదే విధానం పాటించనున్నారు. 

1 .) ఈ ప్రణాళికలో 9 ,10 తరగతుల వారు ఉదయం పుట తెలుగు మాధ్యమం వారికి, మధ్యాహ్నం పుట ఆంగ్ల మాధ్యమం వారికి పాతాళ సందేహ నివృత్తి జరుపుకునేలా విద్యాశాఖ ప్రణాళిక ఇచ్చింది. 

2.) 22 & 23 తేదీల్లో తరగతి గదిలో విద్యార్థులకు పూర్వజ్ఞానం పై అవగాహనా

పెంచడమే. 

కోవిడ్ నియమ నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించాలి 

పాఠశాలలోని తరగతి గదులను ప్రయోగశాలలను మరుగుదొడ్లను వంటశాలలు గ్రామ సచివాలయ సిబ్బంది సహకారంతో సురక్షితం చేసుకుంటూ పాఠశాలలో బోధనలు నిర్వహించాలి 

తరగతి గదిలోని విద్యార్థులు ఒకరి వస్తువులు ఇంకొకరు మార్చుకోకుండా

ఇచ్చిపుచ్చు కోకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

1 నుంచి 8 తరగతుల వారికి:. . .

1 నుంచి 8 తరగతుల వారికి వీరికి పూర్తిగా ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో తరగతులు నిర్వహించాలి. వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు రాకూడదు. 

అవసరం అయితే వారి తల్లిదండ్రులు మాత్రమే పాఠశాలకు హాజరు కావాలి

విద్యా

వారధి విద్య అమృతం కౌన్సిలింగ్ కార్యక్రమాలు విద్యార్థులు వీక్షించే లా చర్యలు తీసుకోవాలి.

9 10 తరగతుల విద్యార్థులకు మార్గదర్శకాలు వీరు పాఠశాలకు హాజరు కావాలంటే కచ్చితంగా తల్లిదండ్రుల అంగీకార పత్రం పాఠశాలకు అందించాలి.
 
ప్రతి ఒక్క విద్యార్థి సామాజిక దూరం పాటిస్తూ ముఖానికి మాస్క్ ధరించాలి శానిటైజర్

లేదా సబ్బును అందుబాటులో ఉంచుకోవాలి. 

ప్రతి ఒక్క విద్యార్థి ఆరోగ్య సేతు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam