DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే:నరసాపురం ఎంపీ

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 21, 2020 (డి ఎన్ ఎస్ ):* తిరుమలలో అన్యమతస్థులకు డిక్లరేషన్‌ తప్పనిసరి అని... ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసే అధికారం తితిదే చైర్మన్‌కు లేదని వై స్ఆర్ కాంగ్రెస్ నరసాపురం ఎంపీ, కనుమూరి రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు.

★ హిందూ ఆలయాలపై దాడులను

వ్యతిరేకిస్తూ..నల్ల బ్యాడ్జి ధరించి పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటానని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. 

★ దాడులపై సీబీఐ విచారణ కోరితే తమ పార్టీ వాళ్లే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 

★ తితిదే వీవీఐపీలకు మాత్రమే డిక్లరేషన్ విధానం ఉందని... గత జీవో రద్దు చేయకుండా నిర్ణయం

తీసుకోవడం సాధ్యం కాదని ఎంపీ అన్నారు. 

★ ప్రభుత్వ జీవోను రద్దు చేసే అధికారం తితిదే ఛైర్మన్‌కు లేదని... సీఎం తిరుమల వెళ్లినపుడు డిక్లరేషన్ ఇవ్వాలని కోరారు.

★ పార్టీ బహిష్కరించినా ప్రజలు బహిష్కరించలేదని... తననొక వారధిగా భావిస్తున్నారని ఎంపీ అన్నారు.

★ ఒకట్రెండు నెలల్లో పార్టీ నుంచి

బహిష్కరిస్తారని అనుకుంటున్నానని... తనపై అనర్హత వేటు వేయించడం సాధ్యం కాదని తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam