DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్‌లాక్-4.0: స్కూళ్లు, రైల్వేతో సహా పెద్ద మార్పులు

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 21, 2020 (డి ఎన్ ఎస్ ):*  కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి వచ్చి ఆరు నెలలు అయి పోయింది. దేశంలో ఒక్కొక్క దశలో మార్పులు చేసుకుంటూ వస్తుంది కేంద్రం.ఈ క్రమంలోనే ఆరు నెలలు నుంచి ఆగిపోయిన కీలకమైన మార్పులు చెయ్యబోతుంది కేంద్రం. 
కరోనా వైరస్ లాక్‌డౌన్ తరువాత,

భారతదేశం ఇప్పుడు అన్‌లాక్ నాల్గవ దశలో ఉంది. సెప్టెంబర్ 21న ఈ దశ ప్రారంభం అవుతుండగా అంటే రేపటి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు తెరవ బడతాయి. వీటితో పాటు, భారతీయ రైల్వే కూడా ప్రయాణీకుల సౌలభ్యం కోసం రేపటి నుంచి 40 కొత్త రైళ్లను నడుపు తుంది.               

కరోనా కాలంలో జరుగుతున్న ప్రధాన మార్పు.

పట్టాలెక్కుతున్న రైళ్లు. రేపటి నుంచి రైల్వేలో పెద్ద మార్పు కనిపిస్తుంది.  లాక్‌డౌన్ తరువాత, రైల్వే ఇప్పుడు నెమ్మదిగా రైళ్లను నడపడం ప్రారంభించగా రైల్వే 80 ప్రత్యేక రైళ్లను ఇంతకుముందే ప్రారంభిం చింది.          

ఇప్పుడు సెప్టెంబర్ 21 న అంటే రేపటి నుంచి మరో 40 కొత్త రైళ్లను నడుపుతుంది. ఇండియన్ రైల్వే

వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు.

కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా పాఠశాల కళాశాలలు ఆరు నెలలకు పైగా మూసివేశారు. అయితే రేపటి నుంచి పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించ వచ్చు. 

ప్రస్తుతానికి, మునుపటిలా తరగతులు జరగవు, కాని పిల్లలు కౌన్సెలింగ్ కోసం తల్లిదండ్రుల అనుమతితో

పాఠశాలకు వెళ్ళవచ్చు. 

అన్‌లాక్ 4.0 మార్గ దర్శకంలో, కంటైన్మెంట్ లేని జోన్లలో మాత్రం పాఠశాలలకు అనుమతి లేదు.పాఠశాలలు తెరవడానికి,పాఠశాల పరిపాలన ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను పాటించాలి.                      

దేశ రాజధానిలో మాత్రం విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి మరో 15 రోజులు వేచి

ఉండాల్సి ఉంటుంది. కరోనా పెరుగుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీ ప్రభుత్వం అక్టోబర్ 5 వరకు పాఠశాలను మూసి వేయాలని నిర్ణయించింది.

పర్యాటకుల కోసం తెరుచు కున్న తాజ్ మహల్
కరోనా కారణంగా తాజ్ మహల్ పర్యాటకులకు ఆరు నెలలుగా మూసి వేయ బడింది, కానీ ఇప్పుడు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అన్‌లాక్-4.0లో తిరిగి

తెరవాలని నిర్ణ యించారు.               

తాజ్ మహల్‌తో పాటు,ఆగ్రా కోటను కూడా పర్యాటకులు చూడగలరు.అయితే,తాజ్ మహల్ మరియు ఆగ్రా కోట రెండింటికి పర్యాటకుల సంఖ్య పరిమితం అవు తుంది.ఐదు వేల మంది సందర్శకులు మాత్రమే తాజ్ మహల్ చూడటానికి వెళ్ళ గలుగుతారు, ఆగ్రా కోట పరిమితి 2500. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్ల బుకింగ్

జరుగుతుంది

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam