DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమలలో అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే

*కొడాలి నాని హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిందే. .*

*ఆలిండియ బ్రాహ్మణ సమాఖ్య జాతీయ కార్యదర్శి ఎంఎల్ఎన్ శ్రీనివాస్ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 21, 2020 (డి ఎన్ ఎస్):*  తిరుమల తిరుపతి దేవాలయం లో అన్యమతస్టూలు దర్శనానికి వెళితే కచ్చితంగా డిక్లరేషన్ పైన

సంతకం చేసే అలవాటు 100 ఏళ్ల నుండి వస్తున్నదని అటువంటి హిందూ సంప్రదాయాలను తొలగించటం వలన యావత్ భారతదేశం లోని హిందువుల మనోభావాలు బాధ పడతాయని అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య జాతీయ కార్యదర్శి ఎం ఎల్ ఎన్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలియజేశారు

* గతంలో రాష్ట్రప్రతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు ,సోనియా గాంధీ, విదేశాల నుంచి వచ్చే

ఇతర మతస్తులు అందరూ తిరుపతి వచ్చినపుడు డిక్లరేషన్ పైన సంతకం చేసి స్వామి వారి దర్శనం చేసుకొని ఆశీస్సులు పొందేవారని తెలిపారు.
* గత ప్రభుత్వం లో ఉన్న ఎమ్మెల్యే కి టీటీడీ బోర్డులో పదవి ఇస్తే తాను క్రిస్టియన్ అని తనకు తానే చెప్పుకొని టీటీడీ బోర్డ్ పదవిని  కోల్పోయిందనే విషయం కూడా గుర్తు చేశారు.
* స్వామి వారికి

గతంలో ముఖ్యమంత్రి గా డాక్టర్ వైస్ రాజశేఖర్ రెడ్డి కూడా పట్టు వస్తాలు సమర్పించారని,ఆరోజు రాజశేఖర్ రెడ్డి స్వామి వారికి ఎలా పట్టు వస్త్రాలు సమర్పించారో అలానే నేడు ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్తాలు అందించి స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు.

పొరసరఫరాల శాఖా మంత్రి కొడాలి

నాని వ్యాఖ్యలు అత్యంత అవమానకర రీతిలో ఉన్నాయని చెప్పారు. ఏ దేవాలయంలో అయినా దేవుడు శిలా రూపంలోనే ప్రాణ ప్రతిష్ట పొందుతాడని, పండితులు మంత్ర జపంతో ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తారని తెలిపారు. బాధ్యతాయుత మంత్రిగా ఉన్న కొడాలి నాని తానూ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కోరారు. కొడాలి నానిని

మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam