DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పనులు త్వరగా ప్రారంభించాలి.

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 22, 2020 (డి ఎన్ ఎస్):* విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ పనులు వీలైనంత త్వరగా ప్రారంభించాలని శ్రీకాకుళం ఎంపీ, శ్రీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు (తెలుగుదేశం)  లోక్‌సభలో కోరారు. మంగళవారం సభ సమావేశాల్లో అయన మాట్లాడుతూ దేశంలోనే అత్యధిక

ఆదాయం తీసుకొస్తున్న వాల్తేరు డివిజన్‌ మూసివేతను వ్యతిరేకిస్తున్నానని వ్యాఖ్యానించారు.

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. విశాఖ కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటును కేంద్రం ప్రకటించిందని తెదేపా ఎంపీ రామ్మోహన్​ నాయుడు స్పష్టం చేశారు. 

దక్షిణ కోస్తా

రైల్వేజోన్‌, రాయగడ డివిజన్‌ ఏర్పాటుకు ఇటీవల బడ్జెట్‌లోనూ రూ. 170 కోట్లు కేటాయించారని లోక్​సభలో తెలిపారు. 

ఆ పనులు ఎప్పడు ప్రారంభమవుతాయో ఇప్పటికీ స్పష్టత లేదన్నారు. 

జోన్‌ సరిహద్దులపైనా భేదాభిప్రాయాలు ఉన్నాయన్నారు. 

పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వాటిని సత్వరమే

పరిష్కరించాలని కోరారు.

దేశంలోనే అత్యధిక లాభాలు తీసుకురావడమే కాక... చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వాల్తేరు డివిజన్‌ మూసివేతను వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. 

ఖుర్దా రోడ్‌ డివిజన్‌ పరిధిలో ఉన్న పలాస, మందస, సుమ్మాదేవి, ఇచ్ఛాపురం, బారువా, జాడుపూడి, సోంపేట స్టేషన్లు దక్షిణ కోస్తా

రైల్వే జోన్‌లో కలపాలన్నారు. 

దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు రైల్వేజోన్‌ కోసం పోరాడుతున్నారని తెలిపారు. 

ఆ పనులు వీలైనంత త్వరగా మొదలుపెట్టాలని రామ్మోహన్ నాయుడు కోరారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam