DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంప్రదాయబద్దంగా శ్రీవారి చెంతకు సీఎం వైఎస్ జగన్

*గరుడ సేవ సందర్బంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ*

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 23, 2020 (డి ఎన్ ఎస్ ):* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. పంచెకట్టు, తిరునామంతో శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు.

అనంతరం శ్రీవారి గరుడ వాహన సేవలో సీఎం జగన్ పాల్గొన్నారు. కాసేపటి క్రితమే ఆయన బేడి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు, ఏపీ ఐఐసి చైర్ పెర్సన్ నగరి ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ గురువారం ఉదయం స్వామిని దర్శించుకున్న తదుపరి నాదనీరాజన మండపం లో

జరుగుతున్న సుందరకాండ పారాయణ యజ్ఞంలో పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గురువారం ఉదయం తిరుమల కు చేరుకోనున్నారు, ఉదయం స్వామి దర్శనం అనంతరం కన్నడ కాటేజ్ కు వైఎస్ జగన్ తో కలిసి శంఖుస్థాపన చేయనున్నారు. 
  

రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మద్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం

చేరుకున్నారు.  నేడు తిరుమల శ్రీవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పించనున్న నిమిత్తం రోడ్డుమార్గాన తిరుమల బయలు దేరి వెళ్లారు. విమానాశ్రయంలో స్వాగతం పలికిన ఉప ముఖ్యమంత్రులు  శ్రీ కె.నారాయణ స్వామి, ఆళ్ల నాని, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ పెద్ది రెడ్డి

రామచంద్రా రెడ్డి, బిసి సంక్షేమ శాఖ మంత్రి  టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జెసి  మార్కండేయులు ( ఇంచార్జి కలెక్టర్) నగరపాలక కమిషనర్ గిరీషా, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్, డిఐజి కాంతిరణా టాటా, అర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, చిత్తూరు ఎస్.పి.సెంథిల్ కుమార్, జె ఈ ఓ బసంత్ కుమార్, ఎం.ఎల్.సి. యండవల్లి శ్రీనివాసులు రెడ్డి,

శాసన సభ్యులు తిరుపతి కరుణాకర రెడ్డి,  శ్రీకాళహస్తి బియ్యపు మధుసూధనరెడ్డి, సత్యవేడు ఆదిమూలం,పుత్తూరు రోజా, పూతలపట్టు ఎం.ఎస్.బాబు, పలమనేరు వెంకటే గౌడ, కోడూరు శ్రీనివాసులు,   ఐజి శశిధర్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, డిప్యూటీ కమాండెంట్ దుర్గేష్ చంద్ర శుక్లా, సి.ఎస్.ఓ. రాజశేఖర్ రెడ్డి, రాజంపేట  మేడా

మల్లిఖార్జున రెడ్డి, డిసిసిబి చైర్మన్ రెడ్డెమ్మ, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ , టర్మీనల్ మేనేజర్ గోపాల్, ముఖ్యమంత్రి వెంట డిల్లి నుండి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి,వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి రావడం జరిగింది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam