DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పటిష్ట భద్రతల మధ్య నన్నయ వర్సిటీ డిగ్రీ పరీక్షలు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 23, 2020 (డి ఎన్ ఎస్):* ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్ష కేంద్రాలను రిజిస్ట్రార్ డా. బట్టు గంగారావు పరిశీలించారు. బుధవారం తాడేపల్లిగూడెంలోని డి.ఆర్.జి మెన్ అండ్ ఉమెన్ కళాశాలలను,

జి.ఎం.ఆర్ విద్యార్థి డిగ్రీ కళాశాలను, శ్రీవాసవి డిగ్రీ కళాశాలను మరియు భీమవారంలోని బి.వి.రాజు కళాశాలను ఆయన పరిశీలించారు. దీనిపై రిజిష్ట్రార్ మాట్లాడుతూ ఉభయగోదావరి జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో 113 డిగ్రీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ పరీక్షలు

నిర్వహిస్తున్నామని అన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు 23 వేల మంది విద్యార్థులు వ్రాస్తున్నారని చెప్పారు. పరీక్షల నిర్వహణ, కోవిడ్ నిబంధనల అమలు తదితర అంశాలపై వీసీ డా. మొక్కా జగన్నాథరావు కట్టుదిట్టమైన ఆదేశాలను అందజేసారని తెలిపారు. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెం, భీమవారం పరీక్షా కేంద్రాలను

పరిశీలించామని చెప్పారు. ప్రస్తుతం కెమిస్ట్రీ, బోటని, జూయాలజీ, మ్యాథ్మెటిక్స్, స్టెటస్టిక్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రీనిక్స్ లో క్లస్టర్స్ పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబందనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలనే ఉద్దేశంతో ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ విద్యార్థులకు వేరువేరుగా

పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. డిగ్రీ సైన్స్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకూ, ఆర్ట్స్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో కోవిడ్ నిబందనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలియజేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam