DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ ప్రజా రవాణా బస్సుల్లో ఇక సీటు గ్యాప్ లు ఉండవా. . .

*ఆ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ సాఫ్ట్ వెర్ రూపుదిద్దు కుంటోందా?*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 24, 2020 (డి ఎన్ ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ ) బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్టు

తెలుస్తోంది. కరోనా రాక్షసుని విజృంభణ లో విధించిన లాక్‌డౌన్ సడలింపులు‌ అనంతరం మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించినా.. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా సగం సీట్లకే అనుమతిచ్చారు. కేవలం కొన్ని రూట్ల లోనే పరిమిత స్థాయిలో బస్సులను నడిపారు. ప్రధాన జిల్లా కేంద్రాల నుంచి తెలంగాణ కు బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు నానా

అవస్థలు పడుతున్నారు. ఇతర రాష్ట్రాలకు బస్సులు వెళ్లేందుకు పూర్తిస్థాయి అనుమతులు లేకపోవడంతో అధికారులు సందిగ్ధం లో పడ్డారు. ప్రస్తుతం ఆర్టీసీ ఆర్ధిక భారాన్ని కొంతవరకూ తగ్గించుకోడానికి కనీస సీటు గ్యాప్ దూరాన్ని నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌లో సగం సీట్లే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో

మార్పులు చేశారు. అయితే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో ఆన్‌లైన్‌లో అన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా మార్పులు చేయనున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam