DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి రక్త పరీక్షా యూనిట్ బహుకరణ

*హార్లిక్స్ సంస్థను అభినందించిన సబ్‌ కలెక్టర్ అనుపమ అంజలి* 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 24, 2020 (డి ఎన్ ఎస్ ):* తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం హార్లీక్స్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి అవసరమైన రక్త పరీక్షా పరికరాన్ని బహుకరించడం అభినందనీయమని

రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్‌ సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి అన్నారు. ధవళేశ్వరం హార్లీక్స్‌ ఫ్యాక్టరీ మంజూరు చేసిన సిఎస్సార్‌ నిధులతో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి రక్త పరీక్షా పరికరం(హెమటాలజీ ఎన్‌లైజర్‌)ను రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి చేతుల మీదుగా అందచేశారు. ఈ సందర్భంగా సబ్‌

కలెక్టర్‌ అనుపమ అంజలి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగపడేలా హార్లీక్స్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి రక్త పరీక్షలు చేసే పరికరాన్ని అందించడం అభినందనీయమని అన్నారు. కార్పొరేట్‌ కంపెనీలు తమ సామాజిక బాధ్యతగా పేద ప్రజలను ఆదుకునేందుకు  మరింతగా ముందుకు రావాలని అన్నారు. దాతలు, ఇతర

కార్పొరేట్‌ కంపెనీలు చేస్తున్న సహయాన్ని సద్వినియోగం చేసుకుని ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ జి.సోమసుందరరావు, హార్లీక్స్‌ ఫ్యాక్టరీ హెచ్‌ఆర్‌  హెడ్‌ ఎవిఎన్‌ సతీష్‌కుమార్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అనుష,

తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రేస్‌ మినిస్ట్రీస్‌ స్వచ్చంధ సేవా సంస్థ డైరెక్టర్‌ తేజ్‌ రాజీవ్‌ జాకాబ్‌ సౌజన్యంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్‌ కాన్స్‌ంట్‌ట్రేటర్‌ను డిసిహెచ్‌ఎస్‌ రమేష్‌కిషోర్‌ ఆధ్వర్యంలో సబ్‌ కలెక్టర్‌ అనుపమ అంజలి చేతుల మీదుగా బహుకరించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam