DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ ఉంటే టిడిపి ఏనాడో భూస్తాపితమయ్యేది : వైఎస్ ఆర్ కాంగ్రెస్ నేత బొత్స

వైఎస్ ఉంటే టిడిపి ఏనాడో భూస్తాపితమయ్యేది : బొత్సా .

విశాఖపట్నం, జులై 16, 2018 (DNS Online) : వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంటే తెలుగుదేశం పార్టీ ఏనాడో భూస్తాపితమై

పోయేదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. సోమవారం విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో

అయన మాట్లాడుతూ చంద్రబాబు, టిడిపి కి టైము దగ్గర పడిందని, పైత్యం ముదిరి వెర్రి ప్రేలాపనలు చేస్తున్నాడన్నారు. వైకాపా ను భూస్థాపితం చేస్తాననడం హాస్యాస్పదం గా

ఉందన్నారు. అభివృద్ధి, ఆరోగ్యం, ఆనందంగా ఉన్నాయని కోట్లాది రూపాయల ప్రజా ధనం తో పచ్చ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం పై ప్రజలకు మరో ఆరు నెలల్లో పంజా దెబ్బ కొట్టి

చూపిస్తారన్నారు. అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి బాగా అభివృద్ధి చెందాయి. సామాన్యులు విష జ్వరాలతో, లంచాల బాధతో, అప్పులతో బాధ పడుతున్నారు. ఆనందంగా ఉన్నది అధికారం

అనుభవిస్తున్న వారు మాత్రమే. ఎన్నికల హామీలు ఏం నెరవేర్చారు? కనీసం ఆడపడుచులకు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ అమలు చేశారా? అని ప్రశ్నించారు. 
రుణాలన్నీ మాఫీ అన్నారు.

అధికారానికి వచ్చాక తలా పదివేలు మాత్రమే మాఫీ అన్నారు. చివరికి కొందరికి మూడు వేలు, మరికొందరికి ఆరు వేలు మాఫీ చేసి ఆడపడుచులను అన్యాయం చేశారు. అది కూడా బ్యాంకు ల

నుంచి తీసుకోడానికి లేదన్నారు. ఇపుడు మరో అయిదేళ్లు అధికారం అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి 4530 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఆరులక్షల కోట్లు

వచ్చాయని ప్రచారం చేస్తున్నారని బూచిని చూపించారని హేళన చేశారు. 

 

@ Copy rights reserved 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam