DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అయోధ్య మందిర భూమి పూజకు మోడీ అతిథి మాత్రమే, కర్త కాదు 

*పూజ చేసింది సలిల్ సింఘాల్ దంపతులు, వీహెచ్ పి అధ్యక్షులు సదాశివ్ కాక్జే*          

*మోడీ పై కొడాలి చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న పరివార్ వర్గాలు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2020 (డి ఎన్ ఎస్):* ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది హైందవసమాజం

శతాబ్దాలుగా ఎదురు చూసిన అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజ కు యాజమాన్యం వహించిన అంతా అనుకున్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ కాదు,  పూజ చేసింది సలిల్ సింఘాల్ దంపతులు. అవును ఇది వాస్తవం. ఇదే విషయాన్నీ విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు సదాశివ్ కాక్జే బహిర్గత పరిచారు. 

రెండురోజుల క్రితం ఆంధ్ర

ప్రదేశ్ మంత్రి కొడాలి నాని భారత ప్రధాని నరేంద్ర మోడీ పై భార్యలేనివాడు రామ ఆలయానికి ఎలా వచ్చాడు అంటూ విపరీత వ్యాఖ్యలు చేయడాన్ని సంఘ్ పరివార్ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిపై తమ స్థాయిలో సమాధానం చెప్పాయి. లక్షలాది మంది త్యాగఫలితం అయోధ్య రామ మందిర నిర్మాణానికి దారితీసిందని, అలాంటి మహోన్నత యజ్ఞాన్ని హైందవ ఆచారాలకు

విరుద్ధం గా చేస్తామని ఎలా అనుకున్నారు అని మండిపడుతున్నారు. దేశంలో అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిపై వ్యాఖ్యలు చేసేముందు వివరాలు తెలుసుకోవాలని హితవు పలికాయి.

ఎవరీ సలిల్ సింఘాల్ :. . .

భారత దేశంలో హైందవ సంప్రదాయాన్ని కొనసాగించాలంటూ జరిగిన ఉద్యమానికి ఎన్నో ఏళ్ళు నాయకత్వం వహించిన అశోక్ సింఘాల్ (

విశ్వహిందూ పరిషత్, పూర్వ అధ్యక్షులు) సోదరుడే ఈ సలిల్  సింఘాల్. 
అశోక్ సింఘాల్ చేసిన కృషి కి కృతజ్ఞతగా అయన సొదరుడు సలిల్ సింఘాల్, ఆయన భార్య మధు సింఘాల్ దంపతులతో ఈ అయోధ్య రామ మందిర నిర్మానికి భూమి పూజ జరిపించినట్టు తెలుస్తోంది. వారితోపాటు వాళ్ల కొడుకు మయాంక్ సింఘాల్ కూడా హాజరయ్యారు.  ఈ కార్యక్రమానికి సింఘాల్

కుటుంబం మొత్తాన్ని ఆహ్వానించారు, అయితే కరోనా కట్టడి కారణంగా చాలామంది హాజరు కాలేకపోయారు. 

హైందవ సంప్రదాయం ప్రకారం ఒక శుభకార్యక్రమం జరగాలి అంటే కార్యక్రమ ప్రధాన కర్తలుగా దంపతులు ఉండాలి తప్ప, వివాహం కానీ వ్యక్తులు, భార్యా రహితులు పనికిరారు. ఎందరో పండితులు, పీఠాధిపతులు భాగస్వాములైన ఈ మహోన్నత రామ మందిర

కార్యక్రమం లో ఇలాంటి దోషం జరిగే అవకాశమే లేదు. 

అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాత్రమే భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారని, అయితే అయన దేశాధినేత కావడం మొత్తం మీడియా అయన మీదే దృష్ఠి కేంద్రీకరించింది. అదే వేదిక పై ఉన్న వీరు ఎవరో కూడా టీవీ వీక్షకులకు తెలియకపోవడంతో భూమి పూజను మోడీయే చేశారనే భావనకు

వచ్చేసారు. 

ఆరోజు భూమి పూజ లో వేదికపై  మోడీ తో పాటు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆ రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్, ప్రధాన పూజారి గంగాధర్ పాఠక్, నారద్ భట్టారాయ్, పండిట్ విశిష్టాచార్య లు కూడా కూర్చున్నారు. 

భూమిపూజ ఫోటోల్లోనూ సలిల్ సింఘాల్ దంపతులను

చూడొచ్చు… 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam