DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యథాపూర్వ సేవలతో కాశీ లోని ఆంధ్ర ఆశ్రమం పునః ప్రారంభం

*కోవిడ్ నిబంధనలు కచ్చితంగా అమలు: ట్రస్టీ వివి శాస్త్రి* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2020 (డి ఎన్ ఎస్):* కరోనాసురుని విజృంభణ ధాటికి తట్టుకునేందుకు గత ఆరు నెలలుగా సేవలను నిలిపివేసిన కాశీ క్షేత్రంలోని ఆంధ్ర ఆశ్రమం ( శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం ) యధాపూర్వకంగా సేవలను

ప్రారంభించినట్టు మేనేజింగ్ ట్రస్టీ  వి. వి. సుందర శాస్త్రీ తెలియచేస్తున్నారు. అత్యంత పవిత్రమైన వారణాసి క్షేత్రం లో భక్తులు స్వామి దర్శనానికి వచ్చిన సమయంలో తమ ఆశ్రమం ఆతిధ్యం అందిస్తున్నట్టు తెలిపారు. ఆశ్రమం తిరిగి తెరవబడిందని, పూర్తి స్థాయి సేవలను
యాత్రికులకు అందించనున్నట్టు వివరించారు.  కేంద్ర,

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ఏడాది మార్చి 2020 నుంచి తాత్కాలికంగా నిలిపివేయబడ్డ ఆశ్రమం నేటి నుంచి తిరిగి యధాశక్తి సిద్ధపడిందన్నారు. 

కరోనా మహమారి కారణం గా కాశీలో చాలా మంది యాత్రికులు ఇరుక్కు పోవటం వలన  ఆశ్రమం తరపున అందరికీ ఉచిత వసతి భోజనం ఏర్పాటు చేసి వారిని వారి వారి ఇంటికి బసులు

ద్వారా పంపించే ఏర్పాటు చేసిందని తెలిపారు.  ప్రస్తుతం గవర్నమెంట్ సుచలన ప్రకారం కాశీలో అన్ని దేవాలయాలు తెరిచినందున మళ్లీ శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం  కూడా యాత్రికుల సేవలో ముందుకు వచ్చిందని తెలిపారు.  
ఆశ్రమం తరపున కాశీకి వచ్చే యాత్రికులకు మెయిన్ గేట్ దగ్గర శానిటైజ్ చెయ్యడం తో పాటు,  రోజుకి రెండు సార్లు

కెమికల్ ద్వారా స్ప్రే చేయుట, రోజుకి రెండు సార్లు సాంబ్రాణి పొగ వేయుట వంటి పరిశుభ్ర కార్యాచరణ చేస్తున్నామన్నారు. ముఖానికి మాస్కు ధరించిన వారికే ఆశ్రమం లోనికి  ప్రవేశం కల్పిస్తున్నట్టు తెలిపారు. భోజనం దగ్గర రెండు గజాల దూరం పాటించేవిధంగా ఏర్పాటు చేశామన్నారు. రూమ్ ఖాళీ అయిన తరువాత రూముని సేనిటైజ్ చేయుట తగు

జాగ్రత్తలు ఆశ్రమం తరపున తీసుకుంటున్నామని యాత్రికులు కాశీకి వచ్చేటపుడు  తగు జాగ్రత్తలు తీసుకుని రావలసిందిగా అశ్రమం తరపున కోరుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇతర వివరాలకు : +91 94152 01729 నెంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam