DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోట్ల ఖరీదు చేసే ఇంటిని కంచి వేదపాఠశాల ఇచ్చిన మహోన్నతుడు ఎస్పీ

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 25, 2020 (డిఎన్ఎస్):* సంగీత మహోపాధ్యాయ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అందరికి గాన గంధర్వునిగానే పరిచయం. అయితే ఆయన సంప్రదాయానికి ఎంతో కృషి చేస్తున్నారు. దీనికి నిదర్శనమే ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలోని తిప్పరాజువారీ వీధిలోని తనకు

పూర్వీకుల నుంచి సంక్రమించిన ఇంటిని కంచి పీఠం ఆధ్వర్యవంలో నిర్వహించే వేదపాఠశాల విరాళంగా అందించిన మహనీయులు ఎస్పీ బాలు. దీనికి సంబంధించిన పాత్రలను కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వామీ కి ఈ ఏడాది ఫిబ్రవరి 13 న స్వయంగా అందజేశారు. 

సంస్కృత మరియు వేద పాఠశాల స్థాపించడానికి విరాళంగా ఎస్పీ, ఆయన శ్రీమతి, ఇతర

కుటుంబ సభ్యులతో కలిసి పీఠాధిపతులకు అందచేశారు. బాలసుబ్రహ్మణ్యం సంస్కృతం ప్రచారం చేయడానికి రచనలపై అపారమైన ఆసక్తి కనబరిచారు.

నెల్లూరులోని ఆ ఇంటిని ఎందరో వ్యాపారవేత్తలు అనేక వాణిజ్య ఆఫర్లను స్వీకరించినప్పటికీ, అటువంటి గొప్ప భావన కోసం తన ఇంటిని ఇవ్వాలని నిర్ణయించుకున్న మహనీయులు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam