DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేవైఎం జాతీయ అధ్యక్షునిగా యువ ఎంపీ తేజస్వి సూర్య 

*పార్టీ కి యువతను చేరువ చేసేందుకే బెంగుళూరు ఎంపీ ఎంపిక* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 26, 2020 (డి ఎన్ ఎస్):* దక్షిణ భారత రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేసేందుకు మోడీ - అమిత్ షా ల బృందం పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు వస్తున్న వార్తలకు వాస్తవరూపం

కనిపించింది. కర్ణాటక లోని బెంగుళూ దక్షిణ నియోజక వర్గం ఎంపీ తేజస్వి సూర్య ను భారతీయ జనతా యువమోర్చ జాతీయ కమిటీ కి అధ్యక్షునిగా నియమించింది. ప్రస్తుతం లోక్ సభ సభ్యునిగా నియోజక వర్గం తో పాటు, కర్ణాటక అభివృద్ధిలో కేకల పాత్ర పోషిస్తున్న ఈ యువ న్యాయవాదికి అగ్ర ద్వయం చాలా భారీ భాద్యతే అప్పగించారని చెప్పాలి. 
కేవలం

కర్ణాటక లో కొంత భాగం లో మాత్రమే బీజేపీ కి పట్టు ఉంది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఏమాత్రం చట్ట సభల్లో ప్రాతినిధ్యం కూడా లేదు. ఈ సమయంలో పార్టీ కి యువతను చేరువ చెయ్యడం కోసమే స్ఫురద్రూపి తేజస్వి సూర్య ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.  

సత్సంప్రదాయ కుటుంబానికి చెందిన తేజస్వి సూర్య న్యాయవాదిగా బెంగుళూరు లో

విధులు నిర్వహిస్తున్న సమయంలో నేరుగా నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసారు. మంచి వక్త గా ఇప్పడికే లోక్ సభలో ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్లు సైతం అభినందించిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. 

యువతకు కేంద్రం అందిస్తున్న సంక్షేమ పధకాలను అందించడంతో పాటు, మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే

ప్రాధాన్యంగా ఈ నియామకం జరిగినట్టు తెలుస్తోంది. 

ప్రసుతం ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడిప్పుడే మేలుకొంటున్న బీజేపీ కి సూర్య ద్వారా యువత అండ లభిస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam