DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా పురంధేశ్వరి నియామకం

*బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా పురంధేశ్వరి నియామకం*

*యువమోర్చాకు తేజస్వి, దక్షిణాదిలో పాగా కై కమిటీ కూర్పు* 

దేవాలయాలపై దాడులే జివిఎల్ ను ముంచాయా?

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 26, 2020 (డి ఎన్ ఎస్ ):*  భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులను  భారత భాజపా ప్రధాన

కార్యదర్శి అరుణ్ సింగ్ శనివారం ప్రకటించారు. ఈ జాబితాలో  జాతీయ ప్రధాన కార్యదర్శిగా విశాఖ మాజీ ఎంపీ పురందేశ్వరి నియమితులు కాగా, జాతీయ ఉపాధ్యక్షురాలుగా డీకే అరుణ (తెలంగాణ), జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్, ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడి గా డాక్టర్ లక్ష్మణ్ (తెలంగాణ ) చోటు దక్కించుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ

నడ్డా సారధ్యంలో ఈ బృందాన్ని విధులు నిర్వహించనుంది. 
కర్ణాటక లోని బెంగుళూర్ దక్షిణ నియోజక వర్గం ఎంపీ తేజస్వి సూర్య ను భారతీయ జనతా యువమోర్చ జాతీయ కమిటీ కి అధ్యక్షునిగా నియమించింది. 
గత కమిటీ లో చక్రం త్రిప్పిన మురళి ధర రావు, జివిఎల్ నర్సింహారావులను పార్టీ ప్రక్కన పెట్టింది. దక్షిణాది లో వైఫ్యల్యాల్లో వీరి

పాత్ర కీలకం గా కేంద్ర అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. 
గత 15 నెలలుగా ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్నా హిందూ దేవి దేవతలా ఆలయాల పై దాడులపై ఖండించి, రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడంలో ఘోరంగా విఫలం కావడమే జివిఎల్ నర్సింహారావు, రామ్ మాధవ్ లను ప్రక్కన పెట్టడానికి కారణంగా కనపడుతోంది. అదేవిధంగా తెలంగాణాలో సైతం

జరుగుతున్నా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమైన మురళి ధర రావు ను కూడా ప్రక్కన పెట్టారు. 

అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి గా నియమితులైన పురంధేశ్వరి కి రాష్ట్ర పార్టీ లో ఏమాత్రం పట్టు లేకపోవడంతో రాష్ట్రంలో పార్టీ ఎలా మనుగడ సాగిస్తుందో అధిష్టానానికి తెలియాలి. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam